Vijayawada: దుర్గమ్మ భక్తులకు గమనిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.200 వరకు జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిని పొగాకు నిషేధిత ప్రాంతంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. ఈనెల 26 నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆలయ మెట్ల భాగం నుంచి కొండపై వరకు పొగాకు ఉత్పత్తులు నిషేధించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, భక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20 నుంచి 200 వరకు ఫైన్ వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో పొగాకు నిషేధిత సర్క్యులర్ను స్వయంగా చదివి ఉద్యోగులకు కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. నేషనల్ టొబాకో కంట్రోల్, కోట్పా 2003 చట్టంలో భాగంగా ఆలయ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు నిషేధించామన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని తిరుమలలో అమలు చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు రెండో ఆలయంగా ఇంద్రకీలాద్రిపైనా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు, ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఆలయ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు వాడకూడదని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలుకు మీడియా సహకారం చాలా అవసరమని కలెక్టర్ ఢిల్లీ రావు అభిప్రాయపడ్డారు.
ఇంద్రకీలాద్రిపై పొగాకు నిషేధించిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, WHOకు తెలియజేస్తామని కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. భక్తులకు ఆన్ని విధాలుగా ఈ చట్టంపై ఆలయంలో అవగాహన కల్పిస్తామన్నారు. ఆలయ మెట్ల మార్గం, ఘాట్ రోడ్, కౌంటర్స్, క్యూ లైన్స్ లలో పొగాకు ఉత్పత్తులు నిషేధం అన్నారు. భక్తులకు ఈ విషయం తెలియచేయటం కోసం ఎఫ్ఏం రేడియో, డిజిటల్ మీడియా, కరపత్రాల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. అటు భక్తులు, ఆలయ ఉద్యోగులందరికీ ఈ చట్టం వర్తిస్తుందని ఆలయ ఈవో భ్రమరాంబ ప్రకటించారు. ఇప్పటికే ఆలయ ఉద్యోగులకు అవగాహన కల్పించామని.. దీనికి అందరి సహకారం అవసరమన్నారు. కోవిడ్ కేసుల కారణంగా దుర్గా ఘాట్లో స్నానాలకు ఇప్పట్లో అనుమతి లేదని స్పష్టం చేశారు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
Andhra Pradesh: ఉద్యోగుల ప్రొబేషన్పై ప్రభుత్వం కీలక జీవో జారీ
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!