VMC council meeting: వీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస.. అసలు ఏమైంది..?
- వీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభస..
- మీడియాను కౌన్సిల్ లోకి అనుమతించే అంశంపై వేడి వాడిగా చర్చ..
- కౌన్సిల్ లో నీటి కాలుష్యంపై బలంగానే చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VMC council meeting: వీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభసాగా మారింది.. మొదట మామూలుగా ప్రారంభమైన వీఎంసీ కౌన్సిల్ సమావేశం తరువాత కొంత రసాభసాగా మారింది.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాకపోవడం పై పెద్దగా చర్చ జరగకపోవడం విశేషం.. వీఎంసీలో మెజారిటీ మెంబర్లు వైసీపీ కార్పొరేటర్లుగా ఉండటం.. 122 అంశాలు, 20 ప్రశ్నలతో కూడిన కౌన్సిల్ సమావేశం అన్ని రకాల రుచులు మేళవించిన కదంబంలా జరిగింది.. అయితే, మీడియాను కౌన్సిల్ లోకి అనుమతించే అంశం పై చర్చతో మొదలైన సమావేశంలో మీడియా అనుమతిపై చర్చ వేడి వాడిగా జరగడం, ఆ తరువాత రసాభసాగా మారడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.. కౌన్సిల్ లో నీటి కాలుష్యంపై బలంగానే చర్చ జరిగింది.. నీటి కలర్ మారడంపై టెస్టింగుల పేరిట రోడ్లు తవ్వేసారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు.. 1985 ముందు వేసిన పైప్ లైన్లు ఇంకా ఉన్నాయని.. మార్చాలని.. టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు… పటమట ప్రాంత ప్రజల పట్ల చిన్నచూపు వద్దన్నారు టిడిపి కార్పొరేటర్లు..
ఇక, అమృత్ పథకం ద్వారా జరిగే పనులలో ఛీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లకు మధ్య సమన్వయ లోపం కౌన్సిల్ చర్చలో కొట్టొచ్చినట్టు కనిపించింది.. సిల్ట్ కృష్ణానదిలో డంప్ చేయడంపై అధికారులపై మేయర్ సీరియస్ అవ్వడంతో సిల్ట్ డంపింగ్ కు ప్రత్యేక స్ధలం చూడాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. ఔట్ ఫాల్ డ్రైన్ మూసేస్తే రాణీగారి తోట, భూపేష్ గుప్తా నగర్ లాంటి ప్రాంతాలు వర్షం పడితే మునిగిపోతాయని చర్చకు తీసుకొచ్చారు.. రీటైనింగ్ వాల్ కట్టినా కూడా ఔట్ ఫాల్ డ్రైన్ విషయంలో చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు లేవనెత్తారు.. వర్షాకాలం మొత్తం కృష్ణానదిలోకి వదిలేయాలని, డ్రైన్ లు క్లీన్ చేయాలని ఆదేశించారు మేయర్… కార్మికులకు ఇస్తున్న ట్రాలీలు పాడైపోతే పట్టించుకునే నాధుడు లేడని టిడిపి కార్పొరేటర్లు ఆరోపించారు.. కార్మికులలో వయసు మీద పడ్డ వారి విషయంలో నిర్లక్ష్యం అంటూ టిడిపి కార్పొరేటర్లు విమర్శించారు. అధికారులు కార్మికులకు ఇచ్చే సామాన్య అవసరాలు కూడా ఇవ్వలేని పరిస్ధితిలో కార్పొరేషన్ అంటూ టిడిపి కార్పొరేటర్లు మండిపడ్డారు.
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
మేయర్ ఉత్సవ విగ్రహంలా మారారు అంటూ సీపీఎం కార్పొరేటర్ అనడంతో కొంత వేడీ వాడిగా మారింది కౌన్సిల్… కమిషనర్ వద్ద కార్మికుల ఫైల్ ఉండిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేయర్ ప్రశ్నించడంతో ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్న మేయర్ అనే చర్చ కూడా కౌన్సిల్ సభ్యులలో జరిగింది… మేయర్ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అణిచేస్తోందని సీపీఎం కార్పొరేటర్ ఆరోపించడంతో.. అలాంటిది ఏమీ లేదు అంటూ సీపీఎం కార్పొరేటర్ మైక్ ఆఫ్ చేసారు. ఏపీలో NDA గెలుపుకు అభినందనలు తెలుపుతూ కౌన్సిల్ లో తీర్మానం ప్రవేశపెట్టారు టిడిపి కార్పొరేటర్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు అందాలంటే విజయవాడ ఎంపీ, ఎంఎల్ఏ లని కార్పొరేషన్ తరఫున సన్మానించాలని తీర్మానించారు.. మేయర్ కి గతంలో ఒత్తిడులు ఉండేవన్న టిడిపి కార్పొరేటర్ల కామెంట్ పై మేయర్ క్లారిటీ ఇచ్చారు.. అనంతరం చెత్త పన్ను రద్దు చేయడాన్ని ఆహ్వానించిన కార్పొరేటర్లు, చెత్తపన్ను రద్దు పై జీఓ రావాలని పట్టుబట్టారు….
ఇక, మాకుంది లెక్క మాకిష్టం కుక్క అంటూ చెపుతున్న జీవకారుణ్య సంఘాల ప్రతినిధులు అందరూ తరువాత కౌన్సిల్ కు వీఎంసీ కి రావాలన్నారు కార్పొరేటర్లు… వాళ్ళు తరువాత కౌన్సిల్ కు రాకపోతే కచ్చితంగా కోర్టులో సదరు జంతు ప్రేమికులపై పిటిషన్ వేయాలని కార్పొరేటర్లు కార్పొరే ను డిమాండ్ చేసారు.. ఇప్పటికే కుక్కల అంశం పై ఒక పిటిషన్ ఫైల్ అయిందని అధికారులు చెబితే.. కార్పొరేషన్ తరపున ప్రత్యేక పిటిషన్ వేయాలని ఆదేశించారు మేయర్.. జీవకారుణ్య సంస్ధల ప్రతినిధులు అంతా కౌన్సిల్ కు వచ్చి తీరాలి అంటూ డిమాండ్ చేసింది విజయవాడ మునిసిపల్ కౌన్సిల్.. పార్టీలకు అతీతంగా ఈ ప్రతిపాదనపై టిడిపి, వైసీపీ ఒకే తాటిమీదకు వచ్చి మాట్లాడాయి.. కుక్కల సమస్య కోసం ప్రత్యేక కౌన్సిల్ నిర్వహించేందుకు కూడా మేయర్ అంగీకరించారు… విజయవాడ నగరపాలక సంస్ధ గోశాల పేరిట ఒక గోశాల ను ఎక్సెల్ ప్లాంటు వద్ద ఏర్పాటు చేయాలని మేయర్ ఆదేశాలు జారీ చేసారు… రోడ్లపై గోవులను వదిలేస్తే.. వాటిని విజయవాడ నగరపాలక సంస్ధ గోశాలకు తరలించాలని మేయర్ ఆదేశాలు జారీ చేసారు.. గోవుల యజమానులు వస్తే జరిమానా 5వేలు పైన ఉండేలా విధించాలని అధికారులకు మేయర్ సూచించారు.. ఎట్టకేలకు అన్ని అంశాలపై పూర్తి చర్చ అనంతరం… సజావుగా పూర్తయిన కౌన్సిల్ సమావేశం తదుపరి షెడ్యూల్ త్వరలో తెలుపుతాం అంటూ మేయర్ వాయిదా వేసారు.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!