MP Mithun Reddy: ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డి.. కాసేపట్లో బెయిల్ పిటిషన్పై విచారణ!
- నేటితో ముగియనున్న ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ..
- ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపర్చనున్న పోలీసులు..
- రాజమండ్రి నుంచి విజయవాడకు మిథున్ రెడ్డిని తీసుకెళ్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు. ఈ మేరకు ఎస్కార్ట్ వాహనంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ బయలుదేరారు. ఈ సందర్భంగా ఇవాళ్టితో మిథున్ రెడ్డి రిమాండ్ గడువు ముగియడంతో మరోసారి న్యాయస్థానం ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. అలాగే, లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ పిటిషన్పై కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఐదు రోజుల పాటు ఆయనను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిల్ దాఖలు చేశారు. అయితే, న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందోనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆతృతగా వేచి చూస్తున్నారు.
Read Also: Asia Cup 2025: అందుకే ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
ఇక, ఎంపీ మిథున్ రెడ్డి గత 59 రోజులుగా రిమాండ్లో ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్పై బయటకు వెళ్లి తిరిగి ఈ నెల 11న జైలులో సరెండర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు పిటిషన్ మేరకు కస్టడీకి ఇస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే నాలుగు సార్లు మిథున్ రెడ్డి రిమాండ్ ను పొడిగిస్తూ వచ్చినప్పటికీ, ఇంత వరకు సిట్ అధికారులు కస్టడీకి కోరలేదు. దీన్ని సవాల్ చేస్తూ కస్టడీ పిటిషన్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు మధ్యాహ్నానికి కోర్టులో తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది. రేపు లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!