AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం..
- ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం..
- నలుగురు నిందితుల బెయిల్ ఉత్తర్వులు రద్దు చేయాలని సిట్ పిటిషన్..
- ఏపీ హైకోర్టులో ముగిసిన ఇరు వర్గాల వాదనలు..
- లిఖిత పూర్వక వాదనలు శుక్రవారంలోపు అందజేయాలని హైకోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. లిక్కర్ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ లకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు రద్దు చేయాలని సిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది. నిందితుల తరపున వాదనలు నిరంజన్ రెడ్డి వినిపించగా సిట్ తరపున వాదనలు సిద్ధార్ధ లూథ్రా వినిపించారు. సిద్ధార్ధ లుథ్రా వాదనలలో భాగంగా నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ఉత్తర్వులు చట్ట విరుద్దమని అన్నారు. ఆగస్టు 11న సిట్ అదనపు చార్జి షీట్ దాఖలు చేసిందని అందులో ఈ నలుగురు నిందితుల పాత్ర గురించి వివరించినట్టు చెప్పారు. ఆగస్టు 18న ఏ33 బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ ఏసిబి కోర్టు డిస్మిస్ చేసిందనీ 23న చార్జి షీట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిందని తెలిపారు.
Read Also: Ladakh Violence: లడఖ్ హింసపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. కీలక సమాచారం సేకరణ!
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
ఇక, సెప్టెంబర్ ఒకటో తేదీలోపు అభ్యంతరాలు నివృత్తి చేశామన్నారు వాటిని పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారన్నారు.. 18న రెగ్యులర్ బెయిల్ డిస్మిస్ చేసి సెప్టెంబర్ 5న డిఫాల్ట్ బెయిల్ ఎలా మంజూరు చేస్తారన్నారు. నలుగురు బెయిల్ ఉత్తర్వులు రద్దు చేయలని కోరారు. మరోవైపు, నిందితుల తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెగ్యులర్ బెయిల్ పై ఆదేశాలకు డిఫాల్ట్ బెయిల్ పై ఆదేశాలకు సంబంధం లేదన్నారు. రెగ్యులర్ బెయిల్ పై ఆదేశాలు అప్పటి పరిస్థితి ఆధారాల బట్టి ఉంటుందని.. తర్వాత ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ మంజూరు ఉత్తర్వులపై గతంలో ఇచ్చిన ఆదేశాలు ప్రభావం చూపవన్నారు. 90 రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటానికి చట్టంలో అవకాశం ఉందన్నారు. ఇరు వర్గాల వాదనలు ముగియంతో లిఖిత పూర్వక వాదనలు శుక్రవారంలోపు సమర్పించాలని హైకోర్టు విచారణ వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!