Hidma Diary: సంచలనంగా మరిన హిడ్మా డైరీ.. 27 మంది మావోయిస్టుల అరెస్ట్.. 4 రాష్ట్రాల్లో సోదాలు..
- విజయవాడ కానూరు కొత్త ఆటోనగర్లో 27 మంది మావోయిస్టులు అరెస్ట్..
- ఛత్తీస్గఢ్కు చెందిన 27 మంది మావోయిస్టులు అరెస్ట్..
- కానూరులో అరెస్టయిన వారిలో 21 మంది మహిళా మావోయిస్టులు..
- అరెస్టయిన మావోయిస్టుల్లో నలుగురు కీలక నేతలు..
- వీరంతా హిడ్మా అనుచరులు గా గుర్తింపు..
- ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
- డైరీలో ఉన్న వివరాల ఆధారంగా పెనమలూరులో 27 మంది అరెస్ట్..
- నాలుగు రాష్ట్రాల్లో పరిధిలోని అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hidma Diary: మావోయిస్టు కీలక నేత హిడ్మా డైరీ ఇప్పుడు భద్రతాబలగాలు, పోలీసులకు కీలక సమాచారాన్ని ఇచ్చింది.. దీంతో, రంగంలోకి దిగిన ఆక్టోపస్, పోలీసులు.. విజయవాడలో మకాం వేసిన 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు.. ఈ రోజు మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందగా.. హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. డైరీలో ఉన్న వివరాల ఆధారంగా పెనమలూరులో 27 మంది ఉంటున్నట్లు గుర్తించారు అక్టోబస్ పోలీసులు.. ఇక, డైరీలో ఉన్న సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాల్లో పరిధిలోని అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు..
Read Also: Prashant Kishor: రాజీనామా చేస్తానన్న ప్రకటనపై ప్రశాంత్ కిషోర్ రియాక్షన్ ఇదే!
Also Read
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలపై స్పెషల్ ఏజెన్సీలు దృష్టి సారించగా.. భారీ ఆపరేషన్లో మరో కీలక విజయాన్ని సాధించారు. విజయవాడలోని కానూరు.. ఆటోనగర్ ప్రాంతంలో మొత్తం 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.. అరెస్టైన వారిలో 21 మంది మహిళలు ఉండటం సంచలనంగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలో.. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందినవారని, ఈ రోజు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అనుచరులని గుర్తించారు. అరెస్టయిన వారిలో నలుగురు కీలక మావోయిస్టు కమాండర్లు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
స్థానిక పోలీసుల సహకారంతో ఆక్టోపస్ బలగాలు ప్లాన్ చేసిన ఈ ఆపరేషన్ నిర్వహించారు.. సుమారు 20 రోజుల క్రితం రోజువారీ కూలీలుగా చెప్పుకుంటూ ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు.. ఆ బిల్డింగ్ యజమాని పెనమలూరు ప్రాంతానికి చెందిన అప్పలస్వామి కాగా, ఆయనే ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందిన తర్వాత, అక్కడినుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఉన్న వివరాలే ఈ ఆపరేషన్కు కీలక ఆధారంగా మారాయి..
హిడ్మా డైరీలో కీలక సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది.. మావోయిస్టుల నివాసాల వివరాలు.. సంప్రదింపులకు సంబంధించిన కోడ్లు.. డంప్ల (హథియార్ స్టోరేజ్ పాయింట్లు) లొకేషన్లు వంటి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సమాచారంతోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్.. నాలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.. మావోయిస్టులు ఏపీలో వివిధ ప్రదేశాల్లో ఎనిమిది డంప్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో.. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకోవడం కోసం రంగంలోకి దిగి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు..
తాజావార్తలు
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!