Hidma Diary: సంచలనంగా మరిన హిడ్మా డైరీ.. 27 మంది మావోయిస్టుల అరెస్ట్.. 4 రాష్ట్రాల్లో సోదాలు..
- విజయవాడ కానూరు కొత్త ఆటోనగర్లో 27 మంది మావోయిస్టులు అరెస్ట్..
- ఛత్తీస్గఢ్కు చెందిన 27 మంది మావోయిస్టులు అరెస్ట్..
- కానూరులో అరెస్టయిన వారిలో 21 మంది మహిళా మావోయిస్టులు..
- అరెస్టయిన మావోయిస్టుల్లో నలుగురు కీలక నేతలు..
- వీరంతా హిడ్మా అనుచరులు గా గుర్తింపు..
- ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
- డైరీలో ఉన్న వివరాల ఆధారంగా పెనమలూరులో 27 మంది అరెస్ట్..
- నాలుగు రాష్ట్రాల్లో పరిధిలోని అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hidma Diary: మావోయిస్టు కీలక నేత హిడ్మా డైరీ ఇప్పుడు భద్రతాబలగాలు, పోలీసులకు కీలక సమాచారాన్ని ఇచ్చింది.. దీంతో, రంగంలోకి దిగిన ఆక్టోపస్, పోలీసులు.. విజయవాడలో మకాం వేసిన 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు.. ఈ రోజు మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందగా.. హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. డైరీలో ఉన్న వివరాల ఆధారంగా పెనమలూరులో 27 మంది ఉంటున్నట్లు గుర్తించారు అక్టోబస్ పోలీసులు.. ఇక, డైరీలో ఉన్న సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాల్లో పరిధిలోని అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు..
Read Also: Prashant Kishor: రాజీనామా చేస్తానన్న ప్రకటనపై ప్రశాంత్ కిషోర్ రియాక్షన్ ఇదే!
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలపై స్పెషల్ ఏజెన్సీలు దృష్టి సారించగా.. భారీ ఆపరేషన్లో మరో కీలక విజయాన్ని సాధించారు. విజయవాడలోని కానూరు.. ఆటోనగర్ ప్రాంతంలో మొత్తం 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.. అరెస్టైన వారిలో 21 మంది మహిళలు ఉండటం సంచలనంగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలో.. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందినవారని, ఈ రోజు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అనుచరులని గుర్తించారు. అరెస్టయిన వారిలో నలుగురు కీలక మావోయిస్టు కమాండర్లు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
స్థానిక పోలీసుల సహకారంతో ఆక్టోపస్ బలగాలు ప్లాన్ చేసిన ఈ ఆపరేషన్ నిర్వహించారు.. సుమారు 20 రోజుల క్రితం రోజువారీ కూలీలుగా చెప్పుకుంటూ ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు.. ఆ బిల్డింగ్ యజమాని పెనమలూరు ప్రాంతానికి చెందిన అప్పలస్వామి కాగా, ఆయనే ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందిన తర్వాత, అక్కడినుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఉన్న వివరాలే ఈ ఆపరేషన్కు కీలక ఆధారంగా మారాయి..
హిడ్మా డైరీలో కీలక సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది.. మావోయిస్టుల నివాసాల వివరాలు.. సంప్రదింపులకు సంబంధించిన కోడ్లు.. డంప్ల (హథియార్ స్టోరేజ్ పాయింట్లు) లొకేషన్లు వంటి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సమాచారంతోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్.. నాలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.. మావోయిస్టులు ఏపీలో వివిధ ప్రదేశాల్లో ఎనిమిది డంప్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో.. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకోవడం కోసం రంగంలోకి దిగి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు..
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!