Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో సిట్ మరియు ఎక్సైజ్ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 1300 పేజీలతో కూడిన చార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ చార్జ్షీట్లో మొత్తం 25 మందిపై అభియోగాలు మోపగా, 89 మందిని సాక్షులుగా చేర్చారు.. ఇక, దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు మరియు నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కీలక అంశాలను సిట్ అధికారులు చార్జ్షీట్లో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది..
ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్ధన్రావు, మాజీ మంత్రి జోగి రమేష్ సహకారంతోనే కల్తీ మద్యం తయారీ చేపట్టినట్లు చార్జ్షీట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీ మరియు సరఫరా ద్వారా భారీగా అక్రమ లాభాలు పొందినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే జనార్ధన్రావుతో కలిసి పనిచేయడం ద్వారా జోగి రమేష్ కూడా రాజకీయ మరియు ఆర్థిక లబ్ధి పొందినట్లు సిట్ ఎక్సైజ్ అధికారులు చార్జ్షీట్లో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కేసులో మరికొంతమంది కీలక వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా, ఈ కేసులో సిట్ దాఖలు చేసిన విస్తృత చార్జ్షీట్ రాజకీయ వర్గాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసు తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
ఇక, నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము కూడా అరెస్ట్ అయిన విషయం విదితమే.. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు వారికి బెయిల్ రావడంతో.. 83 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు జోగి బ్రదర్స్.. గత ఏడాది అక్టోబర్ 3న ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యం గుట్టు రట్టు చేశారు. ఇక్కడ తీగ లాగితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా డొంక కదలడంతో అక్కడ కూడా నకిలీ మద్యం తయారీ యూనిట్పై దాడులు చేసి సోదాలు నిర్వహించారు.. ఈ 2 కేసుల్లోనూ కీలక నిందితుడిగా ఉన్న జనార్దనరావు(ఏ1) వాంగ్మూలంతో నవంబర్ 2వ తేదీన జోగి సోదరులను అరెస్ట్ చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!