AP CM: ముంపు బాధితుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశా.. అందరికి అండగా ఉంటా..!
- వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం..
- అందరికి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటా..
- ఎక్కువ మొత్తంలో రెస్య్కూ సిబ్బందిని నియమిస్తాం: సీఎం చంద్రబాబు
AP CM: విజయవాడ నగరంలోని సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉధృతి ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో వరద చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసుకువస్తున్నాట్లు.. బాధితులకు ఆహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ముంపు బాధితుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసాను.. బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాను అని పేర్కొన్నారు. ఇంత వరదను ఊహించలేదు.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి వరదలు చూడలేదు.. అవసరమైతే మళ్ళీ వస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Vijayawada: విజయవాడలో వెనక్కి ప్రవహిస్తోన్న బుడమేరు వాగు
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
ఇక, అధికారులను అందుబాటులో ఉంచుతాను అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతీ ఒక్కరి కష్టాన్ని చూసాను.. అందరికీ ఆహార పదార్థాలు సరఫరా చేస్తాం.. లోతట్టు ప్రాంతాల వారు దగ్గరిలోని పెద్ద బిల్డింగులోకి వెళ్ళండి.. పెద్ద బిల్డింగుల వాళ్ళు పెద్ద మనసుతో అందరికీ సహకరించాలి.. బోట్లు లేకపోవటం వల్ల కొంత జాప్యం జరుగుతుంది.. గంట గంటకు పరిస్థితి మానిటర్ చేస్తాను.. 24/7 అందుబాటులో ఉండి.. అందరూ సురక్షితంగా బయట పడే వరకు విశ్రమించను అని ముఖ్యమంత్రి అన్నారు. ఇంకా రెస్య్కూ సిబ్బందిని ఎక్కువగా విధులు నిర్వహించేలా ఏర్పాటు చేస్తాం.. ప్రతి ఒక్కరికి తినడానికి ఆహారంతో పాటు ఉండటానికి సదుపాయం కూడా కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో