Flood Relief Compensation: విజయవాడ వరద బాధితులకు గుడ్న్యూస్.. అకౌంట్లలో నగదు జమ
- విజయవాడ వరద బాధితిలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
- ఈ రోజు మరో 1501 మంది బాధితులు పరిహారం విడుదల..
- రూ.2.5 కోట్లు పరిహారం బాధితుల ఖాతాల్లో జమ..
- పలు దఫాలుగా పరిహారం జమ చేస్తూ వస్తున్న ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flood Relief Compensation: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు కృష్ణానది ఉగ్రరూపం.. బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ సిటీ అతలాకుతలం అయ్యింది.. ఎన్నడూ చూడనంత నష్టాన్ని చూసింది.. అయితే, యుద్ధప్రతిపదికన చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఓవైపు బాధితులను ఆదుకుంటూనే.. ఇంకో వైపు బుడమేరు కాలువకు పడిన గండ్లను పూడ్చేందుకు చర్యలు తీసుకుంది.. ఇక, క్రమంగా బెజవాడ కోలుకున్న తర్వాత.. వరద నష్టాన్ని అంచనా వేసింది.. ఇప్పుడు విజయవాడ వరద బాధితిలకు గుడ్న్యూస్ చెప్పింది.. ఇప్పటికే వరద బాధితులకు పరిహానం ప్రకటించిన ప్రభుత్వం.. ఈ రోజు మరో 1,501 మంది బాధితుల కోసం రూ.2.5 కోట్లు పరిహారం విడుదల చేసింది.. 1,501 మంది బాధితులకు వారి అకౌంట్లకు నేడు నగదు బదిలీ చేసింది..
Read Also: OTT Movies : టీవీ ప్రేక్షకులకు పండగే.. ఓటీటీల్లోకి ఒక్క రోజే 23సినిమాలు
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
అయితే, ఇందులో బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్ గా ఉండడం వల్ల 143 మందికి లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ అవ్వలేదని అధికారులు గుర్తించారు.. వీరికి సంబంధించి మరోసారి బ్యాంకు వివరాలు తీసుకుని పరిహారం అందించనున్నారు అధికారులు.. బ్యాంకు అకౌంట్లు అందుబాటులో లేని మరో 256 మంది అర్హుల వివరాలను ఆయా సచివాలయాలు, ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా వెల్లడించనుంది ప్రభుత్వం.. బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించి ఈ 256 మంది తమకు వచ్చే పరిహారం పొందవచ్చని అధికారులు వెల్లడించారు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం అందాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.. పరిహారం అందజేతపై తాజా వివరాలు సీఎంవోకు తెలిపారు జిల్లా అధికారులు.
Read Also: 35 Chinna Katha Kaadu: 384 ఎంట్రీలలో ఒకటి.. ’35 చిన్న కథ కాదు’ చిత్రంకు అరుదైన ఘనత!
సెప్టెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు వరదలు తగ్గిన 15 రోజుల్లో 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పటి వరకు మొత్తం రూ.618 కోట్ల పరిహారం నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేశారు.. ముందుగా రూ.602 కోట్లు.. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దాదాపు 9 వేల మందికి మరో రూ.16 కోట్లు చెల్లించారు.. మళ్లీ కొత్తగా 2,954 దరఖాస్తులు రాగా.. అందులో 1,646 దరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించామని.. తాజాగా సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు వెల్లడించారు.. ఇక, ఈ రోజు 1,501 మంది బాధితుల కోసం రూ.2.5 కోట్ల పరిహారం విడుదల చేసింది ప్రభుత్వం..
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!