AP CEO: వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా.. ఎన్నికల వేళ భారీగా డబ్బులు దొరుకుతుండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే.. వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా భేటీ అయ్యారు. పార్టీలు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సాఫీ నిర్వహణపై పార్టీలతో ఏపీ సీఈఓ చర్చించారు. మీటింగ్ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అభ్యర్థి ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం సరైంది కాదని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి నిబంధనలు లేవని తెలిపారు.
Read Also: R. Krishnaiah: అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలి..
Also Read
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
తమ అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని బోండా ఉమ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లో కూడా ఈ నిబంధనలు లేవని అన్నారు. వైసీపీ నేతలు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో ఎమ్మెల్సీ రుహల్లా మసీదులో డబ్బులు పంచుతున్నారని తెలిపారు. మసీదులో, చర్చిలు, దేవాలయాల్లో ఇలా డబ్బులు పంచకూడదని ఎలక్షన్ కమిషన్ నిబంధన ఉందని చెప్పారు. ప్రతిపక్షాలకు అనేక నిబంధనలు పెడుతున్నారు.. కానీ అధికార పార్టీ నేతలు నిబంధనలు వర్తింప చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు, చీరలు, కుక్కర్లు పంచుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు.
Read Also: Bengaluru Water Crisis: బెంగళూరు నీటి ఎద్దడి.. తగ్గించేందుకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!