AP CEO: వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా.. ఎన్నికల వేళ భారీగా డబ్బులు దొరుకుతుండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే.. వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా భేటీ అయ్యారు. పార్టీలు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సాఫీ నిర్వహణపై పార్టీలతో ఏపీ సీఈఓ చర్చించారు. మీటింగ్ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అభ్యర్థి ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం సరైంది కాదని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి నిబంధనలు లేవని తెలిపారు.
Read Also: R. Krishnaiah: అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలి..
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
తమ అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని బోండా ఉమ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లో కూడా ఈ నిబంధనలు లేవని అన్నారు. వైసీపీ నేతలు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో ఎమ్మెల్సీ రుహల్లా మసీదులో డబ్బులు పంచుతున్నారని తెలిపారు. మసీదులో, చర్చిలు, దేవాలయాల్లో ఇలా డబ్బులు పంచకూడదని ఎలక్షన్ కమిషన్ నిబంధన ఉందని చెప్పారు. ప్రతిపక్షాలకు అనేక నిబంధనలు పెడుతున్నారు.. కానీ అధికార పార్టీ నేతలు నిబంధనలు వర్తింప చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు, చీరలు, కుక్కర్లు పంచుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు.
Read Also: Bengaluru Water Crisis: బెంగళూరు నీటి ఎద్దడి.. తగ్గించేందుకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!