AP CEO: వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా.. ఎన్నికల వేళ భారీగా డబ్బులు దొరుకుతుండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే.. వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా భేటీ అయ్యారు. పార్టీలు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సాఫీ నిర్వహణపై పార్టీలతో ఏపీ సీఈఓ చర్చించారు. మీటింగ్ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అభ్యర్థి ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం సరైంది కాదని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి నిబంధనలు లేవని తెలిపారు.
Read Also: R. Krishnaiah: అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలి..
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
తమ అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని బోండా ఉమ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లో కూడా ఈ నిబంధనలు లేవని అన్నారు. వైసీపీ నేతలు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో ఎమ్మెల్సీ రుహల్లా మసీదులో డబ్బులు పంచుతున్నారని తెలిపారు. మసీదులో, చర్చిలు, దేవాలయాల్లో ఇలా డబ్బులు పంచకూడదని ఎలక్షన్ కమిషన్ నిబంధన ఉందని చెప్పారు. ప్రతిపక్షాలకు అనేక నిబంధనలు పెడుతున్నారు.. కానీ అధికార పార్టీ నేతలు నిబంధనలు వర్తింప చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు, చీరలు, కుక్కర్లు పంచుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు.
Read Also: Bengaluru Water Crisis: బెంగళూరు నీటి ఎద్దడి.. తగ్గించేందుకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!