Sound Pollution : బైక్ సౌండ్ పొల్యూషన్ పై పోలీసుల ఉక్కుపాదం..
- అర్ధరాత్రి బైక్ రేసింగ్లపై పోలీసుల రేడ్
- మోడిఫైడ్ సైలెన్సర్ల వల్ల భయంకర శబ్ద కాలుష్యం
- స్వాధీనం చేసిన వాహనాలపై కఠిన చర్యలు
- యువత, తల్లిదండ్రులకు పోలీసుల కీలక సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ నగరంలో అర్ధరాత్రి వేళల్లో బైక్ రేసింగ్లు, వికృత శబ్దాలతో బెంబేలెత్తిస్తున్న ఆకతాయలపై నగర ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా బుల్లెట్ వంటి ద్విచక్ర వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్చి, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు.
సాధారణంగా వాహన తయారీ కంపెనీలు నిర్ణీత శబ్ద పరిమితితో సైలెన్సర్లను అందిస్తాయి. అయితే, కొంతమంది యువకులు వినోదం కోసం ఆ సైలెన్సర్లను తొలగించి, మార్కెట్లో దొరికే ‘మోడిఫైడ్ సైలెన్సర్లను’ లేదా ‘డబుల్ సైలెన్సర్లను’ బిగిస్తున్నారు. వీటి వల్ల వచ్చే అతి భయంకరమైన శబ్దం కారణంగా అర్ధరాత్రి వేళల్లో నిద్రిస్తున్న చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ప్రధాన రహదారులపై యువత చేస్తున్న ఈ విన్యాసాల వల్ల సామాన్య ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
Also Read
Divi Vadthya : పెళ్లి.. విడాకుల కంటే అదే బెటర్.. దివి షాకింగ్ కామెంట్స్!
ఈ భారీ శబ్దాల వల్ల కేవలం ధ్వని కాలుష్యమే కాకుండా, ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చే ఈ పెద్ద శబ్దాల వల్ల రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా, గుండె జబ్బులు ఉన్నవారికి ఇటువంటి శబ్దాల వల్ల ఒక్కసారిగా ‘హార్ట్ స్ట్రోక్’ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు , పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇటువంటి వాహనాలపై తక్షణమే చర్యలు తీసుకోవడం అత్యవసరమని అధికారులు భావించారు.
విజయవాడ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్లో భారీ సంఖ్యలో బైక్లను సీజ్ చేశారు. పట్టుబడిన వాహనాలకు ఉన్న నకిలీ సైలెన్సర్లను తొలగించి, వాటిపై సౌండ్ పొల్యూషన్ , రాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే, నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలపై కూడా చర్యలు తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు తిరిగి కంపెనీ సైలెన్సర్లను అమర్చిన తర్వాతే యజమానులకు అప్పగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు పాటించని పక్షంలో లైసెన్సులను రద్దు చేసే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతూనే, పోలీసులు తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన సూచన చేశారు. పిల్లలకు ఖరీదైన బైక్లు కొనివ్వడమే కాకుండా, వారు వాటిని ఎలా వాడుతున్నారో గమనించాలని కోరారు. ఇటువంటి వికృత చేష్టల వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు కలగడమే కాకుండా, పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతినే అవకాశం ఉందని గుర్తుచేశారు. నగరంలో శాంతిభద్రతలు కాపాడటంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజయవాడ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బ్లాస్ట్ షురూ అంటూ.. క్రేజీ పోస్టర్ రిలీజ్
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!