Girl Kidnap: బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. తల్లి చెంతకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో సంచలనం కలిగించిన బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మూడు ఏళ్ల బాలికను మహిళా కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు. కేసు దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. డబ్బుల కోసం పాపను అమ్మకానికి పెట్టింది విజయవాడకు చెందిన లక్ష్మి, పాప తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో కిడ్నాప్ కు పన్నాగం పన్నింది.
గుడివాడకు చెందిన విజయలక్ష్మి అనే ఆమెకు 25 వేలకు పాపను తీసుకుని వెళ్ళమని ఒప్పందం కుదుర్చుకుంది. ఆడుకుంటున్న పాపను పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేశారు కిలాడీ కిడ్నాపర్లు, లక్ష్మితో కుదుర్చుకున్న ఒప్పందంతో విజయలక్ష్మి, పద్మ అను ఇద్దరు కలిసి పాపను అమ్మకానికి పెట్టారు. 2 లక్షలకు పాపను అమ్మేందుకు ప్రయత్నించారు. పాప ను కొన్నవారికి అప్పగించే క్రమంలో ఇబ్రహీంపట్నం వద్ద పాపతో సహా కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
అసలేం జరిగిందంటే..
ఈ నెల 8న విజయవాడ రైల్వే స్టేషన్ లో పదో నెంబర్ ప్లాట్ ఫామ్ పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులు విజయవాడకు చెందిన మహిళను రెండో పెళ్ళి చేసుకున్నాడు. వారికి షఫీదా అనే పాప ఉంది. ఆంజనేయులు అక్కడే కూలి పని చేస్తుంటాడు. అతడి భార్య చిత్తు కాగితాలు ఏరుతుంటుంది. ఇద్దరూ కలిసి రైల్వేస్టేషన్లో ఉంటున్నారు.సాయంత్రం ఆరు గంటల సమయంలో నిద్రపోతున్న పాప దగ్గరికి వచ్చిన ఇద్దరు మహిళలు చాక్లెట్స్ ఇస్తామని స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చారు. నిద్రనుంచి మేల్కొన్న తల్లిదండ్రులకు పాప కనిపించకపోవడంతో అంతా వెదికారు. జీఆర్పీ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగారు పోలీసులు. సీసీ టీవీ ఆధారంగా దర్యాప్తు జరిపి కిడ్నాపర్ల ఆట కట్టించారు.
Green India Challenge 5: 16న ప్రారంభించనున్న సద్గురు జగ్గీ వాసుదేవ్
తాజావార్తలు
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!