Girl Kidnap: బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. తల్లి చెంతకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో సంచలనం కలిగించిన బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మూడు ఏళ్ల బాలికను మహిళా కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు. కేసు దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. డబ్బుల కోసం పాపను అమ్మకానికి పెట్టింది విజయవాడకు చెందిన లక్ష్మి, పాప తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో కిడ్నాప్ కు పన్నాగం పన్నింది.
గుడివాడకు చెందిన విజయలక్ష్మి అనే ఆమెకు 25 వేలకు పాపను తీసుకుని వెళ్ళమని ఒప్పందం కుదుర్చుకుంది. ఆడుకుంటున్న పాపను పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేశారు కిలాడీ కిడ్నాపర్లు, లక్ష్మితో కుదుర్చుకున్న ఒప్పందంతో విజయలక్ష్మి, పద్మ అను ఇద్దరు కలిసి పాపను అమ్మకానికి పెట్టారు. 2 లక్షలకు పాపను అమ్మేందుకు ప్రయత్నించారు. పాప ను కొన్నవారికి అప్పగించే క్రమంలో ఇబ్రహీంపట్నం వద్ద పాపతో సహా కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Also Read
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
అసలేం జరిగిందంటే..
ఈ నెల 8న విజయవాడ రైల్వే స్టేషన్ లో పదో నెంబర్ ప్లాట్ ఫామ్ పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులు విజయవాడకు చెందిన మహిళను రెండో పెళ్ళి చేసుకున్నాడు. వారికి షఫీదా అనే పాప ఉంది. ఆంజనేయులు అక్కడే కూలి పని చేస్తుంటాడు. అతడి భార్య చిత్తు కాగితాలు ఏరుతుంటుంది. ఇద్దరూ కలిసి రైల్వేస్టేషన్లో ఉంటున్నారు.సాయంత్రం ఆరు గంటల సమయంలో నిద్రపోతున్న పాప దగ్గరికి వచ్చిన ఇద్దరు మహిళలు చాక్లెట్స్ ఇస్తామని స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చారు. నిద్రనుంచి మేల్కొన్న తల్లిదండ్రులకు పాప కనిపించకపోవడంతో అంతా వెదికారు. జీఆర్పీ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగారు పోలీసులు. సీసీ టీవీ ఆధారంగా దర్యాప్తు జరిపి కిడ్నాపర్ల ఆట కట్టించారు.
Green India Challenge 5: 16న ప్రారంభించనున్న సద్గురు జగ్గీ వాసుదేవ్
తాజావార్తలు
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!