ఒక్కొక్కరు జైలు పాలవుతుంటే చంద్రబాబు భయం పట్టుకుంది !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి లో ఒక్కొక్కరు జైలు పాలవుతుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. “రాష్ట్రంలో అన్ని స్థాయిల ఎన్నికలు పూర్తయ్యాయి. కరోనా నియంత్రణ చర్యల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. ఇంక ఎవరి దృష్టి మళ్లిస్తే ఎవరికి లాభం చంద్రబాబూ? నీ బందిపోటు ముఠాలో ఒక్కొక్కరు జైలు పాలవుతుంటే భయం పట్టుకుందా? పొంతన లేకుండా మాట్లాడుతున్నావు. తుని నియోజకవర్గంలో తుక్కు తుక్కు అయ్యాక ఫ్రస్టేషన్ పీక్ కు చేరింది యనమలకు. చిత్తుగా ఓడిన ధూళిపాళ్లను వందల కోట్ల అవినీతి కేసులో అరెస్టు చేస్తే రాజకీయంగా ఎదుర్కోలేక లోపలేయించిందంట ప్రభుత్వం. ధూళి గెలిపించిన మున్సిపాలిటీలెన్ని, పంచాయితీలెన్ని? నీలాగే గుండు సున్నా కదా! పాడి రైతుల ఉసురుపోసుకున్న ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టయితే చంద్రబాబు, ఆయన బందిపోట్ల ముఠా అమూల్ కు మేలు చేయడానికి సంగంను దెబ్బ తీస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అమూల్ అనేది రైతుల సహకార డెయిరీ. హెరిటేజ్ లా ఎవరి కుటుంబ ఆస్తి కాదు. నీకు నష్టమనేగా ఏడుపు అంతా.” అంటూ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.
Also Read
- Tags
- ap
- tdp
- vijayasaireddy
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!