Vijayasai Reddy: ఈరోజు జీఓ తగలబెట్టాడు.. రేపు రాజ్యాంగాన్ని కూడా.. చంద్రబాబుపై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Fires On Chandrababu Naidu For Burning GO No1: సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెలో జీవో నం.1 ప్రతులను భోగిమంటల్లో తగలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే! ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ మాధ్యమంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు జీవోని తగలబెట్టాడని, రేపు రాజ్యాంగాన్ని కూడా చంద్రబాబు తగలబెడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం తెచ్చిన జీవోను బహిరంగంగా తగలబెట్టడాన్ని బట్టి.. భారతీయ చట్టం, ప్రజాస్వామ్యం పట్ల చంద్రబాబుకు ఏమాత్రం మర్యాదలేదని స్పష్టమవుతోంది. ఈరోజు ఆయన జీవోని తగలబెట్టాడు, రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా తగలబెడతాడేమో. గతంలోనూ ఇలాగే ఒకరు బహిరంగంగా ప్రభుత్వ పత్రాలను చించివేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో అందరికీ తెలుసు. నియంత పోకడలు అంటే ఇవే’’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Hema Malini: సింగర్గా మారిన అలనాటి అందాల నటి
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
అంతకుముందు.. కందుకూరు, గుంటూరు సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు చంద్రబాబుపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. విషాదకర ఘటన నుంచి కూడా లబ్ధి పొందాలనే నీచ మనస్తత్వం ఉన్న రాజకీయ నేత ఒక్క చంద్రబాబు నాయుడేనని ధ్వజమెత్తారు. మరణంలోనూ కుల ప్రస్తావన చంద్రబాబుకే చెల్లిందని.. చంద్రబాబుకు ఫొటోషూట్, డ్రోన్ షాట్ పిచ్చి కారణంగానే కందుకూరులో 8 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. జనం పెద్దగా రాకపోయినా.. బాగా వచ్చారని చూపించడం కోసం ఒక చిన్న ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వాహనాన్ని అటుగా తీసుకెళ్లి మరీ 8 మందిని చంపారని ఆరోపణలు చేశారు. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. మన రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటూ ప్రజలు ఛీ కొడుతున్నా.. ఆయనకు పట్టింపులేదన్నారు. ఈ విషాదం నుంచి కూడా రాజకీయ ప్రయోజనం పొందడానికి శవాలపై పేలాలేరుకునే విధంగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
IND vs SL 3rd ODI: శతకాలతో చెలరేగిన గిల్, కోహ్లీ.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం
తాజావార్తలు
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!