Water Flow: హ్యాండ్ పంపుల నుంచి జలధార
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా జలధారే. ఎటు చూసినా వరద ప్రవాహమే (Flood Water). తక్కువ లోతుకే ఇక్కడ బోర్లు పడుతుంటాయి. నీటి అవసరాల కోసం గోదావరి జిల్లాల్లో చేతిపంపులు ఎక్కువగా ఏర్పాటుచేసుకుంటారు. తాజాగా గోదావరి ఉప్పొంగడంతో గ్రామాల్లోని హ్యాండ్ పంపుల నుంచి ఉబికి ఉబికి వస్తోంది నీరు. చేతితో కొడితేనే సాధారణంగా నీరు వస్తుంది కానీ. ఇప్పుడు వర్షాలు, వరదల కారణంగా హ్యాండ్ పంపుల నుంచి ఏకధాటిగా నీరు వస్తోంది. గోదావరికి సమీపాన వున్న పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.
గోదావరి తీరాన వున్న యలమంచిలి మండలం లక్ష్మీపాలెంల గ్రామంలోని హ్యాండ్ పంపుల నుంచి నీరు రావడంతో గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి తామెప్పుడూ చూడలేదంటున్నారు గ్రామస్తులు. అయితే ఈ బోర్ వాటర్ కాస్త బురదగా వుందని గ్రామస్తులు చెబుతున్నారు. రెండుమూడు రోజులుగా ఇలాంటి పరిస్థితి వుందని లక్ష్మీపురం, సమీప గ్రామాల ప్రజలు ఎన్టీవీకి తెలిపారు. భూగర్భ జలాలు పెరగడం వల్ల ఇలా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. ఎండాకాలంలో కూడా ఈ పంపుల నుంచి నీరు బాగా వస్తుందని, స్వచ్ఛంగా కూడా వుంటుందని వారు చెబుతున్నారు. హ్యాండ్ పంపుల నుంచి వస్తున్న నీరు వీడియో వైరల్ అవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీవీ పర్యటించినప్పుడు ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపించాయి. ఇది అసాధారణం ఏమీ కాకపోయినా, ఎలాంటి పంపులు లేకుండానే వాటంతట అవే నీరు రావడం విచిత్రంగా వుందని అక్కడి యువత అంటున్నారు.
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. తెలంగాణలోని ఏటూరు నాగారంలో బోరు నుంచి అదేపనిగా నీరు రావడం రైతుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా మనం బోరు వేయాలంటే లక్షలు ఖర్చుపెట్టాలి. అయినా నీళ్ళుపడితే అదృష్టం. లేకుంటే.. అంతే సంగతులు. నీళ్ళు పడకుంటే మళ్ళీ షరామామూలే. అయితే ఈమధ్యకాలంలో ఏటూరునాగారంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కరెంట్ మోటారు లేకుండానే బోరు ఎత్తిపోసింది. ఈ నీటి ద్వారా 20 ఎకరాలకు పైగా సాగుచేసుకున్నారు రైతులు. ఎలాంటి ఖర్చులేకుండా నీరు రావడంతో రైతులు ఖుషీ అయ్యారు.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?