Kurnool Crime: కర్నూల్లో దారుణం.. ఇద్దరు మహిళల హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Women Killed In Kurnool By Unknown Persons In Kurnool District: కఠినమైన చట్టాలు వస్తున్నాయి కానీ.. నేరస్తులపై తగిన చర్యలే తీసుకోవడం లేదు. దీన్నే అలుసుగా తీసుకొని దుండుగులు రెచ్చిపోతున్నారు. కొన్నాళ్లు జైలు శిక్షకు మించి పెద్దగా నష్టాలేవీ జరగవని భావిస్తూ.. నేరాలకు పాల్పడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. మరీ ముఖ్యంగా.. మహిళల్నే టార్గెట్ చేసుకొని, కొందరు కిరాతకులు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే అత్యాచారం చేయడం లేదా ఏదో ఒక విషయంలో పగ పెంచుకొని చంపడం లాంటి ‘నేరాలు-ఘోరాలు’ చేస్తున్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలోనూ గుర్తు తెలియని వ్యక్తులు.. అలాంటి దారుణానికే పాల్పడ్డారు. ఇద్దరు మహిళల్ని కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Tragedy: దుబాయ్లో విషాదం.. భవనంపై నుంచి పడి ఐదేళ్ల భారతీయ చిన్నారి మృతి
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
కర్నూలు జిల్లాలోని ఓరకల్లు మండలం నన్నూరుకి చెందిన రామేశ్వరి, రేణుక అనే మహిళలు కూలి పనులు చేసుకుంటూ.. తమ జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పట్లాగే బుధవారం కూడా వీళ్లు కూలి పనులకు వెళ్లారు. అయితే.. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళలపై దాడి చేశారు. వారి చెర నుంచి తప్పించుకుని, పారిపోవడానికి రామేశ్వరి, రేణుక ప్రయత్నించారు కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ దుండగులు తమతో తెచ్చుకున్న కత్తితో వారి గొంతు కోసి చంపేశారు. రామేశ్వరి, రేణుక చనిపోయారని నిర్ధారించుకొని.. ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వీరి మరణవార్త విని.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని కోరుకుంటున్నారు.
Wedding Video Going Viral: స్టేజ్పై వధువును బలవంతం చేసిన వరుడు..
మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. రామేశ్వరి, రేణుకలని మాత్రమే టార్గెట్ చేశారంటే.. కచ్ఛితంగా ఎవరో తెలిసిన వారే ఈ పనికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?