Kurnool Crime: కర్నూల్లో దారుణం.. ఇద్దరు మహిళల హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Women Killed In Kurnool By Unknown Persons In Kurnool District: కఠినమైన చట్టాలు వస్తున్నాయి కానీ.. నేరస్తులపై తగిన చర్యలే తీసుకోవడం లేదు. దీన్నే అలుసుగా తీసుకొని దుండుగులు రెచ్చిపోతున్నారు. కొన్నాళ్లు జైలు శిక్షకు మించి పెద్దగా నష్టాలేవీ జరగవని భావిస్తూ.. నేరాలకు పాల్పడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. మరీ ముఖ్యంగా.. మహిళల్నే టార్గెట్ చేసుకొని, కొందరు కిరాతకులు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే అత్యాచారం చేయడం లేదా ఏదో ఒక విషయంలో పగ పెంచుకొని చంపడం లాంటి ‘నేరాలు-ఘోరాలు’ చేస్తున్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలోనూ గుర్తు తెలియని వ్యక్తులు.. అలాంటి దారుణానికే పాల్పడ్డారు. ఇద్దరు మహిళల్ని కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Tragedy: దుబాయ్లో విషాదం.. భవనంపై నుంచి పడి ఐదేళ్ల భారతీయ చిన్నారి మృతి
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
కర్నూలు జిల్లాలోని ఓరకల్లు మండలం నన్నూరుకి చెందిన రామేశ్వరి, రేణుక అనే మహిళలు కూలి పనులు చేసుకుంటూ.. తమ జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పట్లాగే బుధవారం కూడా వీళ్లు కూలి పనులకు వెళ్లారు. అయితే.. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళలపై దాడి చేశారు. వారి చెర నుంచి తప్పించుకుని, పారిపోవడానికి రామేశ్వరి, రేణుక ప్రయత్నించారు కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ దుండగులు తమతో తెచ్చుకున్న కత్తితో వారి గొంతు కోసి చంపేశారు. రామేశ్వరి, రేణుక చనిపోయారని నిర్ధారించుకొని.. ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వీరి మరణవార్త విని.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని కోరుకుంటున్నారు.
Wedding Video Going Viral: స్టేజ్పై వధువును బలవంతం చేసిన వరుడు..
మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. రామేశ్వరి, రేణుకలని మాత్రమే టార్గెట్ చేశారంటే.. కచ్ఛితంగా ఎవరో తెలిసిన వారే ఈ పనికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!