ఏపీ యువతిపై బెంగళూరులో అఘాయిత్యం.. ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతిపై బెంగళూరులో అఘాయిత్యం జరిగింది… బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన యువతి.. బెంగళూరులోని ఓ సంస్థలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితం టోనీ అనే నైజీరియన్ తో ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ఫోన్లు మాట్లాడుకునే వరకు వెళ్లింది.. తాజాగా ఇద్దరం ఓసారి కలుద్దామని నిర్ణయానికి వచ్చారు.. ఇదే క్రమంలో ఆగస్టు 31వ తేదీన సదరు యువతి కమ్మరహళ్లిలోని టోనీ ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నారు.. మద్యం మత్తులో నిద్రలోకి జారుకుంది ఆ యువతి.. కానీ, ఉదయం నిద్ర లేచేసరికి ఆమెకు అసలు విషయం అర్థమైంది..
ఎందుకంటే.. ఉదయం నిద్రలేచేసరికి తన పక్కన మరో యువకుడు నగ్నంగా ఉండటం చూసి షాక్కు గురైంది.. రాత్రి తాను మద్యం మత్తులో ఉన్న సమయంలో టోనీతో పాటు మరో యువకుడు కూడా తనపై అత్యాచారం చేశాయని గ్రహించింది.. అతను టోనీ స్నేహితుడు ఉబాకాగా గుర్తించింది. గతంలోనూ అతను తనకోసారి మెసేజ్ చేసినట్లు గుర్తు తెచ్చుకుంది. తనను కలిసేందుకు అతడు ప్రయత్నించగా ఆమె అతడిని దూరం పెడుతూ వచ్చింది.. బాకా గురించి టోనీని ఆమె ప్రశ్నించగా.. అతనెవరో తనకు తెలియదని బుకాయించాడు. దీంతో బాన్సవాడి పోలీసులను ఆశ్రయించింది బాధిత యువతి.. తనపై ఇద్దరు నైజీరియన్లు అత్యాచారానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొంది.. మరోవైపు.. ఆ యువతికి ఇద్దరు నైజీరియన్లతో కొంతకాలంగా పరిచయం ఉందని.. సోషల్ మీడియా ద్వారా వీరు స్నేహితులుగా మారారని.. ఈ క్రమంలో ఆగస్టు 31న రాత్రి యువతి వారి ఇంటికి వెళ్లింది.. అక్కడ ఆమె శీతల పానీయం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతే.. ఇద్దరు నైజీరియన్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారనే వర్షన్ కూడా ఉంది.. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రహించిన ఆమె.. ఆ తర్వాత బాన్సవాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!