ఏపీ యువతిపై బెంగళూరులో అఘాయిత్యం.. ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతిపై బెంగళూరులో అఘాయిత్యం జరిగింది… బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన యువతి.. బెంగళూరులోని ఓ సంస్థలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితం టోనీ అనే నైజీరియన్ తో ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ఫోన్లు మాట్లాడుకునే వరకు వెళ్లింది.. తాజాగా ఇద్దరం ఓసారి కలుద్దామని నిర్ణయానికి వచ్చారు.. ఇదే క్రమంలో ఆగస్టు 31వ తేదీన సదరు యువతి కమ్మరహళ్లిలోని టోనీ ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నారు.. మద్యం మత్తులో నిద్రలోకి జారుకుంది ఆ యువతి.. కానీ, ఉదయం నిద్ర లేచేసరికి ఆమెకు అసలు విషయం అర్థమైంది..
ఎందుకంటే.. ఉదయం నిద్రలేచేసరికి తన పక్కన మరో యువకుడు నగ్నంగా ఉండటం చూసి షాక్కు గురైంది.. రాత్రి తాను మద్యం మత్తులో ఉన్న సమయంలో టోనీతో పాటు మరో యువకుడు కూడా తనపై అత్యాచారం చేశాయని గ్రహించింది.. అతను టోనీ స్నేహితుడు ఉబాకాగా గుర్తించింది. గతంలోనూ అతను తనకోసారి మెసేజ్ చేసినట్లు గుర్తు తెచ్చుకుంది. తనను కలిసేందుకు అతడు ప్రయత్నించగా ఆమె అతడిని దూరం పెడుతూ వచ్చింది.. బాకా గురించి టోనీని ఆమె ప్రశ్నించగా.. అతనెవరో తనకు తెలియదని బుకాయించాడు. దీంతో బాన్సవాడి పోలీసులను ఆశ్రయించింది బాధిత యువతి.. తనపై ఇద్దరు నైజీరియన్లు అత్యాచారానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొంది.. మరోవైపు.. ఆ యువతికి ఇద్దరు నైజీరియన్లతో కొంతకాలంగా పరిచయం ఉందని.. సోషల్ మీడియా ద్వారా వీరు స్నేహితులుగా మారారని.. ఈ క్రమంలో ఆగస్టు 31న రాత్రి యువతి వారి ఇంటికి వెళ్లింది.. అక్కడ ఆమె శీతల పానీయం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతే.. ఇద్దరు నైజీరియన్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారనే వర్షన్ కూడా ఉంది.. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రహించిన ఆమె.. ఆ తర్వాత బాన్సవాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!