Tulasi Reddy: బీజేపీ అంటే అర్థం అదా? తులసిరెడ్డి ఏమన్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తులసిరెడ్డి.. ఏపీ కాంగ్రెస్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఆ పార్టీలో యాక్టివ్ గా వుండే నేత తులసిరెడ్డి. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా అయిన తులసిరెడ్డి నిత్యం హాట్ కామెంట్స్ తో వార్తల్లో వుంటారు. తాజాగా ఆయన బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఏపీ రాజకీయాలపై తనదైన రీతిలో స్పందించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు (Chandrababu) జగన్ (Jaganmohan Reddy), పవన్ (Pawan Kalyan) అని కొత్త భాష్యం చెప్పారు. ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేస్తోందన్న ఆయన.. వైసీపీ, టీడీపీ, జనసేన ఆ పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. ఎనిమిది సంవత్సరాలలో విభజన చట్టంలో ఒక్క అంశాన్ని కూడా కేంద్రంలోని మోడీ సర్కార్ అమలు చేయలేదన్నారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో కాంగ్రెస్ త్వరలో చేపట్టనున్న ‘భారత్ జోడో’ యాత్ర 100 కిలోమీటర్ల మేర కొనసాగుతుందన్నారు. ఈ జోడో యాత్ర రాయదుర్గంలో ప్రారంభమై రెండు పార్లమెంటు, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తులసిరెడ్డి వివరించారు. రాష్ట్రంలో దుష్ట చతుష్టయ పార్టీలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని తులసిరెడ్డి కోరారు. నరేంద్ర మోడి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలను దీనికోసం ఉపయోగించుకుంటుందని ఫైర్ అయ్యారు. సత్యాగ్రహ ఆయుధం ద్వారా బిజెపి కక్ష రాజకీయాలను ఎదుర్కొంటామన్నారు. దేశంలో చరిత్ర పునరావృతం అవుతుంది . గతంలో జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ , చౌదరి చరణ్ సింగ్ లు ఇందిరాగాంధీని వేధించారు. ప్రజలు తర్వాతి ఎన్నికల్లో జనతా పార్టీకి బుద్ధి చెప్పారని తెలిపారు. ప్రస్తుతం నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వానికి కూడా ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఈడీ వేధిస్తోందన్నారు.
Also Read
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రితో అంబటి భేటీ
తాజావార్తలు
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!