నేడు టీటీడీ పాలకమండలి సమావేశంలో 85 అంశాలపై చర్చ..
ఇవాళ జరగబోయే సమావేశంలో 85 అంశాలు పై చర్చించనుంది టీటీడీ పాలకమండలి. టెబుల్ అజేండగా మరిన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీవారి ఆలయంలో దర్శనాల పెంపు పై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి… గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు తేనుంది. వరాహస్వామి ఆలయ గర్బాలయ వాకిలికి దాత సహాయంతో 180 కేజిల వెండితో తాపడం పనులపై నిర్ణయం తీసుకోనున్నారు.తిరుపతి ఆలయంలో పుష్పకైంకర్యానికి వినియోగించే పుష్పాలతో అగరబత్తుల తయ్యారికి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో మూడో దశలో 1389 సిసి కెమెరాలు ఏర్పాటుకు టెండర్లు ఖరారు చేయనున్నారు.
Read Also : యువతి నెంబర్ ఇవ్వలేదని యువకుడి కాల్పులు…
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
ఇక ధార్మిక ప్రచారంలో భాగంగా కళ్యాణమస్తూ,ఎస్సి ఎస్టి బిసి కాలనీలో 500 ఆలయాలు నిర్మాణం త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. హౌసింగ్ సొసైటీ నిబంధనల మేరకు ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించనున్నారు. హిందూ దేవాలయాలకు ఇచ్చే విగ్రహాలు కేటాయింపు సబ్సిడీ 3లక్షలకు తగ్గించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. టీటీడీ విద్యాసంస్థలలో చదువుకునే హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా ఆహారం పంపిణీ చేయనున్నారు. టీటీడీ అస్పత్రులలో మందులు కొనుగోళ్లు.. టీటీడీలోని పలు విభాగాలలో తాత్కాలిక పోస్టులను శాశ్వత పోస్టులుగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏటీసీ,వరాహస్వామి అతిధి గృహం,ఉద్యోగుల కాటేజీలు ఆధునికరణ… కాకులమాను కొండ వద్ద వున్న విండ్ పవర్ ను 10ఏళ్ళు పాటు ఉచితంగా మైంటైన్స్ కు గ్రీంకో ఎనరజిస్ కు కేటాయించనున్నారు.
కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం వడ్డపల్లెలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. 25ఏళ్ళు పాటు సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఎన్టిపీసీతో ఎంవోయూ… మొదటి ఘాట్ రోడ్డులోని 57వ మలుపు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సేఫ్టీ మెష్ ఏర్పాటు. చేయనున్నారు. 2.9 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పేరూరులోని వకుళమాత ఆలయం వద్ద ప్రహరీ నిర్మాణంతో పాటుగా శ్రీనివాసం,విష్ణునివాసం,శ్రీవారి మెట్టు వద్ద శివశక్తీ డైరీ పార్లర్ కు దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. 108,104 సర్వీస్ సంస్థయినా ఆరబిందో కు శ్రీనివాసం,శ్రీదేవి కాంప్లెక్స్ లలో నామినల్ అద్దెకు గదులు కేటాయించనున్నారు. తిరుమల మినహా టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాలకు విష్ణుభట్టాచార్యులను వైఖానస ఆగమ అడ్వైసర్ గా అలాగే టీటీడీ పరిధిలోని ఆలయాలలో చనిపోయ్యిన అర్చకుల స్థానంలో నూతన అర్చకుల నియామకం మరియు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులతో పాటు పలువురు అర్చకులు సర్వీస్ రెగ్యులరైజషన్ చేయనున్నారు. ఇక భారీగా నెయ్యి, ముడిసరుకులు కొనుగోలకు ఆమోదం అలాగే తిరుమలలోని పలు మఠాలు క్రమబద్దికరణతో పాటు లీజు కాలపరిమితి పొడిగింపుపై నిర్ణయామ్ తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!