Atrocities Girls: అన్నమయ్య జిల్లాలో అమానుషం.. 14 ఏళ్లకే పసిబిడ్డను జన్మనిచ్చిన మైనర్ బాలిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocities Girls: ఆ బాలికకు 14 ఏళ్లు.. బాగా చదివించాలని కుటుంబ సభ్యుల బాలికను గురుకుల పాఠశాలలో చేర్పించారు. కన్న కూతురు బాగా చదువుకుని అభివృద్ది చెందుతుందని ఆశ పడ్డారు. కానీ ఇంతలోనే ఓఘటన ఆతల్లిదండ్రులకు కంటతడి పెట్టించింది. 14ఏళ్ల మైనర్ బాలిక తల్లైందని చెప్పడంతో.. షాక్ కు గురయ్యారు. గురుకుల పాఠశాలలో ప్రశ్నించగా అది మా సమస్య కాదంటూ చేతులు దులుపుకున్నారు. వైద్యం చేయించేందుకు తీసుకువెళ్లగా మైనర్ బాలికకు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో.. వైద్యులు ఆమెను చికిత్స చేశారు. దీంతో ఆబాలిక బిడ్డను కనింది. ఆమె వయస్సు చూస్తే 14ఏండ్లు.. అభం శుభం తెలియని ఆబాలిక చేతిలో మరో పసిబాలుడు ఇదెక్కడి న్యాయం అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఇంటి అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠిచర్యలు తీసుకోవాలని కోరారు. గురుకుల పాఠశాల యాజమాన్యం మాత్రం మాకు ఏమీ తెలియదంటూ చేతులు దులుపుకోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈఘటన ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Read also: BIG Breking: చెన్నై ద్రౌపది దేవి ఉత్సవాల్లో అపశృతి.. భక్తులపై క్రేన్ పడటంతో ముగ్గుమృతి
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలిక స్వస్థలం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం. తల్లిదండ్రులు జీవనోపాధి కోసం తిరుపతికి వచ్చి శ్రీసిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ వరదయ్యపాలెంలో నివాసం ఉంటున్నారు. మైనర్ బాలిక సోమలలో తన తాతయ్యల వద్ద ఉంటూ గురుకుల పాఠశాలలో చదువుతున్నట్లు డీసీఓ తెలిపారు. బాలికను ఆరో తరగతిలో హాస్టల్లో చేర్చారు. 9వ తరగతి చదువుతుండగా తల్లి అయింది.హాస్టల్లో కడుపునొప్పితో బాధపడుతోందని బాలిక చెప్పడంతో వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మైనర్ బాలిక గర్భవతి అని వైద్యులు గుర్తించారు. అక్కడ ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐసీడీసీ అధికారులు చిన్నారిని స్వాధీనం చేసుకుని విద్యార్థిని తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా హాస్టల్ సిబ్బంది, అధికారులు, తల్లిదండ్రులకు తెలియకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈఘటనపై జిల్లా కలెక్టర్.. హాస్టల్ సిబ్బంది, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మృతదేహాలు ఎందుకు కనిపించలేదు?
జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో మైనర్ బాలిక పుట్టడంపై డీసీఓ వెంకటరావు వివరణ ఇచ్చారు. వేసవి సెలవుల్లో బాలిక ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన తప్పిదమే ఇందుకు కారణమని వాదించారు. బాలికకు పీరియడ్స్ రాకపోవడాన్ని గమనించిన అధికారులు.. తల్లిదండ్రులకు చెప్పినా వైద్యులను ఆశ్రయించి వైద్యం చేయించుకోకపోవడంతో అధికారులు ఇంత వరకూ రావడంతో ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, తల్లిదండ్రులకు సమాచారం అందించామని డీసీఓ తెలిపారు. కాగా.. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. దీంతో.. మైనర్ను గర్భవతిని చేసింది ఎవరూ అనే విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు.
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మృతదేహాలు ఎందుకు కనిపించలేదు?
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!