Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మృతదేహాలు ఎందుకు కనిపించలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad Fire Accident: హైదరాబాద్లోని సికింద్రాబాద్ నల్లగుట్ట డెక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదు రోజుల కావస్తున్నా ఇంకా అదృశ్యమైన యువకుల ఆచూకీ లభించక పోవడంతో కలకలం రేపుతుంది. పోలీసులు అగ్నిమాపక శాఖ, డీఆర్ఎఫ్, క్లూస్ టీమ్ సిబ్బంది భవనంలోని అన్ని అంతస్తుల్లోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించినా ఫలితం దక్కలేదు. క్లూస్ టీమ్ నిపుణులు ప్రత్యేక లైట్లను ఉపయోగించి భవనంలోని అన్ని అంతస్తుల్లో వెతికినా యువకుల జాడ కానరాలేదు. గల్లంతైన గుజరాత్ కు చెందిన వసీం, జునైద్, జహీర్ కోసం జరిపిన గాలింపు చర్యల్లో ఒకరి మృతదేహం అవశేషాలు మాత్రమే లభించాయి. మిగతా ఇద్దరి జాడ అస్సలు కనిపించలేదు. అయితే దొరకిని అవశేషాలు ఇంకా ఎవరివి అనేది ప్రశ్నగానే ఉంది. అయితే.. మొదటి, రెండో అంతస్తు పైకప్పు కూలిపోయి కిందపడడంతో శిథిలాలతో చెత్త నిండిపోయింది.
Read also: Nagoba Jatara: నాగోబా జాతరకు కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నేడు పెర్సాపేన్, బాన్ పేన్ పూజలు
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
అయితే.. ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు అన్నట్టు గుర్తించారు అధికారులు. కాగా ఆచెత్తను అంతటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. అయితే.. ఇనుప గ్రిల్స్ పైకప్పులకు ఆనుకొని ఉండడంతో వాటిని తొలగిస్తే పైకప్పుల పరిస్థితి ఏంటని అధికారులు ఆలోచనలో పడ్డారు. దీనికోసం ఇంజినీరింగ్ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇక.. మరోవైపు కనిపించకుండా పోయిన యువకుల మృతదేహాలను తమకు అప్పగించాలని వారి బంధువులు రోదిస్తున్నారు. యువకుల మృతదేహాలు వారికి అప్పగించే వరకు భవనం కూల్చివేత పనులు నిలిపివేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ప్రమాదం జరిగిన భవనం పరిస్థితి ప్రమాదకరంగా ఉందని భవనం పరిసరాలకు ఎవరూ రావొద్దంటూ జీహెచ్ఎంసీ అధికారులు స్థానికంగా నోటీసులు అందించారు. దీంతో.. ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చి వేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో… ప్రత్యేక సాంకేతిక ఉపయోగించి చుట్టు పక్కల ఇళ్లకు ఇబ్బంది కల్గకుండా కూల్చి వేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు.
Read also: Metro Train Stopped: మళ్లీ మెరాయించిన మెట్రో.. ఈసారి ఎల్బీనగర్ వైపు..
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ షోరూమ్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.. గురువారం ఉదయం 11.20 గంటలకు ఫోన్ రాగానే విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. ఈనేపథ్యంలో.. చుట్టు పక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్దరించామన్నారు. కాగా.. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, వైర్లు పూర్తిగా కాలిపోయేవని తెలిపారు. ఇక భవనానికి మొత్తం 6 మీటర్లు ఉన్నాయని తెలిపిన శ్రీధర్.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. అయితే.. ప్రమాదం జరిగినప్పటి నుంచి అందులో ముగ్గురు గల్లంతు అయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారి ఆచూకీ మాత్రం లోపల కనుగొనలేకపోయారు అధికారులు.
Flexis War BRS: అధికార పార్టీలో వర్గ విభేదాలు.. ఫ్లెక్సీల్లో ప్రొటోకాల్ రగడ
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..