TTD Hundi Collection New Record: టీటీడీ కొత్త చరిత్ర.. 21 రోజులకే రూ.100 కోట్లు దాటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయంలో కొత్త రికార్డు సృష్టించింది.. జులై మాసంలో కోనేటిరాయుడికీ కాసుల వర్షం కురుస్తోంది.. ఈ నెలలో కేవలం 21 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ను క్రాస్ చేసింది శ్రీవారి హుండీ ఆదాయం.. జులై 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారికీ హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 100 కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయంగా వచ్చింది.. జులై మాసంలో స్వామివారికి ఇంత మొత్తంలో హుండీ ఆదాయం లభించడం ఇదే తొలిసారి.. ఇక, టీటీడీ చరిత్రలోకే అత్యధిక స్థాయిలో ఆదాయం జులై మాసంలో లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇప్పటి వరకు గత మే మాసంలో లభించిన 130 కోట్ల రూపాయలే అత్యధిక హుండీ ఆదాయం కాగా.. ఈ నెల 31వ తేదీ వరకు మరింత ఆదాయం వస్తుంది కాబట్టి.. మొట్ట మొదటి సారి హుండీ ద్వారా ఒకే మాసంలో 140 కోట్ల రూపాయలు ఆదాయం శ్రీవారికి లభించే అవకాశం ఉందంటున్నారు.
Read Also: CJI Justice NV Ramana: మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోంది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
కరోనా మహమ్మారవి విజృంభణ తర్వాత చాలా కాలం శ్రీవారికి దూరం అయ్యారు సామాన్య భక్తులు.. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. మరోవైపు హుండీలో కాసుల వర్షం కురుస్తోంది.. గత ఐదు నెలలుగా రూ.100 కోట్ల మార్క్ను దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తుంది టీటీడీ.. మార్చి నెలలో శ్రీవారికి రూ.128 కోట్ల ఆదాయం, ఏప్రిల్ రూ.127.5 కోట్లు, మే మాసంలో రికార్డు స్థాయిలో 130.05 కోట్ల , జూన్ మాసంలో రూ.123 కోట్ల ఆదాయం రాగా.. జులై మాసంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ.. స్వామి వారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది.. ఈ నెలలోనే 4వ తేదీ టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.6.18 కోట్ల ఆదాయం లభించింది.. దీంతో మరో పది రోజుల హుండీ ఆదాయం సరాసరి లెక్కించినా.. జులై మాసంలో టీటీడీ ఆదాయం కొత్త చరిత్ర లిఖిస్తుందని అంచనా వేస్తున్నారు.. ఐదు నెలల కాలంలోనే శ్రీవారి హుండీ ఆదాయం 650 కోట్ల రూపాయాలను క్రాస్ చేయగా.. ఈ ఏడాది మొత్తం ఆదయాం రూ. 15 వందల కోట్లును కూడా దాటేసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!