TTD Hundi Collection New Record: టీటీడీ కొత్త చరిత్ర.. 21 రోజులకే రూ.100 కోట్లు దాటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయంలో కొత్త రికార్డు సృష్టించింది.. జులై మాసంలో కోనేటిరాయుడికీ కాసుల వర్షం కురుస్తోంది.. ఈ నెలలో కేవలం 21 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ను క్రాస్ చేసింది శ్రీవారి హుండీ ఆదాయం.. జులై 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారికీ హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 100 కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయంగా వచ్చింది.. జులై మాసంలో స్వామివారికి ఇంత మొత్తంలో హుండీ ఆదాయం లభించడం ఇదే తొలిసారి.. ఇక, టీటీడీ చరిత్రలోకే అత్యధిక స్థాయిలో ఆదాయం జులై మాసంలో లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇప్పటి వరకు గత మే మాసంలో లభించిన 130 కోట్ల రూపాయలే అత్యధిక హుండీ ఆదాయం కాగా.. ఈ నెల 31వ తేదీ వరకు మరింత ఆదాయం వస్తుంది కాబట్టి.. మొట్ట మొదటి సారి హుండీ ద్వారా ఒకే మాసంలో 140 కోట్ల రూపాయలు ఆదాయం శ్రీవారికి లభించే అవకాశం ఉందంటున్నారు.
Read Also: CJI Justice NV Ramana: మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోంది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్
Also Read
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- OTR : ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి వైసీపీ పోరాటం..?
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి 250 సరుకులు.. రూ.5 తక్కువకే..
- OTR : గంటాకు క్లీన్ చిట్ మిషన్.. కలెక్టర్కు లేఖ వెనుక అసలు కథ.!
కరోనా మహమ్మారవి విజృంభణ తర్వాత చాలా కాలం శ్రీవారికి దూరం అయ్యారు సామాన్య భక్తులు.. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. మరోవైపు హుండీలో కాసుల వర్షం కురుస్తోంది.. గత ఐదు నెలలుగా రూ.100 కోట్ల మార్క్ను దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తుంది టీటీడీ.. మార్చి నెలలో శ్రీవారికి రూ.128 కోట్ల ఆదాయం, ఏప్రిల్ రూ.127.5 కోట్లు, మే మాసంలో రికార్డు స్థాయిలో 130.05 కోట్ల , జూన్ మాసంలో రూ.123 కోట్ల ఆదాయం రాగా.. జులై మాసంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ.. స్వామి వారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది.. ఈ నెలలోనే 4వ తేదీ టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.6.18 కోట్ల ఆదాయం లభించింది.. దీంతో మరో పది రోజుల హుండీ ఆదాయం సరాసరి లెక్కించినా.. జులై మాసంలో టీటీడీ ఆదాయం కొత్త చరిత్ర లిఖిస్తుందని అంచనా వేస్తున్నారు.. ఐదు నెలల కాలంలోనే శ్రీవారి హుండీ ఆదాయం 650 కోట్ల రూపాయాలను క్రాస్ చేయగా.. ఈ ఏడాది మొత్తం ఆదయాం రూ. 15 వందల కోట్లును కూడా దాటేసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!