Tirumala Rush: తిరుమలకు భక్తుల క్యూ..సర్వదర్శనం టోకెన్లకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో మూడు రోజుల తర్వాత సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రేపు ,ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ. 13వ తేదీకి సంబంధించిన టోకెన్లు 12వ తేదీ ఉదయం నుంచి జారీ చేయనున్నారు.
తిరుమలకు పూర్వ వైభవం వస్తోంది. కలియుగ వైకుంఠనాథుడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోణా కారణంగా శ్రీవారి ఆలయంలో దర్శనం విధానంలో అనేక మార్పులు చేసింది టీటీడీ, ప్రస్తుతం సాధారణ రోజుల తరహాలో భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాటు చేసింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ప్రతినిత్యం 30 వేల టికెట్లను ఆన్లైన్ విధానంలో ముందస్తుగానే కేటాయించింది.
Also Read
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
సర్వ దర్శనం క్యూలైన్ ద్వారా ప్రతి నిత్యం 30 వేల మంది భక్తులను ఆఫ్ లైన్ విధానంలో టోకెన్లు జారీచేసి దర్శనానికి అనుమతిస్తుంది. తిరుపతిలోని అలిపిరి ,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాలు వద్ద సర్వదర్శన భక్తులుకు టోకెన్ల జారీ చేస్తుండగా… ఇవాళ కౌంటర్ వద్దకు వెళ్ళిన భక్తుడికి 12వ తేదీకి దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు దర్శన సమయానికి ఒక రోజు ముందుగానే భక్తులను తిరుమలకు అనుమతించనున్నారు.
దీంతో రెండు రోజుల పాటు భక్తులు తిరుపతిలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు మూడు రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండడం వారిని ఇక్కట్లు గురిచేస్తోంది. అసలే వేసవి, ఉక్కపోత. ఆపై వసతి సౌకర్యం కూడా లభించక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు .దర్శనం టోకెన్లు పోందిన భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు టీటీడీ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!