Tirumala Rush: తిరుమలకు భక్తుల క్యూ..సర్వదర్శనం టోకెన్లకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో మూడు రోజుల తర్వాత సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రేపు ,ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ. 13వ తేదీకి సంబంధించిన టోకెన్లు 12వ తేదీ ఉదయం నుంచి జారీ చేయనున్నారు.
తిరుమలకు పూర్వ వైభవం వస్తోంది. కలియుగ వైకుంఠనాథుడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోణా కారణంగా శ్రీవారి ఆలయంలో దర్శనం విధానంలో అనేక మార్పులు చేసింది టీటీడీ, ప్రస్తుతం సాధారణ రోజుల తరహాలో భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాటు చేసింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ప్రతినిత్యం 30 వేల టికెట్లను ఆన్లైన్ విధానంలో ముందస్తుగానే కేటాయించింది.
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
సర్వ దర్శనం క్యూలైన్ ద్వారా ప్రతి నిత్యం 30 వేల మంది భక్తులను ఆఫ్ లైన్ విధానంలో టోకెన్లు జారీచేసి దర్శనానికి అనుమతిస్తుంది. తిరుపతిలోని అలిపిరి ,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాలు వద్ద సర్వదర్శన భక్తులుకు టోకెన్ల జారీ చేస్తుండగా… ఇవాళ కౌంటర్ వద్దకు వెళ్ళిన భక్తుడికి 12వ తేదీకి దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు దర్శన సమయానికి ఒక రోజు ముందుగానే భక్తులను తిరుమలకు అనుమతించనున్నారు.
దీంతో రెండు రోజుల పాటు భక్తులు తిరుపతిలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు మూడు రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండడం వారిని ఇక్కట్లు గురిచేస్తోంది. అసలే వేసవి, ఉక్కపోత. ఆపై వసతి సౌకర్యం కూడా లభించక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు .దర్శనం టోకెన్లు పోందిన భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు టీటీడీ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!