Tirumala Rush: తిరుమలకు భక్తుల క్యూ..సర్వదర్శనం టోకెన్లకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో మూడు రోజుల తర్వాత సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రేపు ,ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ. 13వ తేదీకి సంబంధించిన టోకెన్లు 12వ తేదీ ఉదయం నుంచి జారీ చేయనున్నారు.
తిరుమలకు పూర్వ వైభవం వస్తోంది. కలియుగ వైకుంఠనాథుడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోణా కారణంగా శ్రీవారి ఆలయంలో దర్శనం విధానంలో అనేక మార్పులు చేసింది టీటీడీ, ప్రస్తుతం సాధారణ రోజుల తరహాలో భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాటు చేసింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ప్రతినిత్యం 30 వేల టికెట్లను ఆన్లైన్ విధానంలో ముందస్తుగానే కేటాయించింది.
Also Read
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
సర్వ దర్శనం క్యూలైన్ ద్వారా ప్రతి నిత్యం 30 వేల మంది భక్తులను ఆఫ్ లైన్ విధానంలో టోకెన్లు జారీచేసి దర్శనానికి అనుమతిస్తుంది. తిరుపతిలోని అలిపిరి ,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాలు వద్ద సర్వదర్శన భక్తులుకు టోకెన్ల జారీ చేస్తుండగా… ఇవాళ కౌంటర్ వద్దకు వెళ్ళిన భక్తుడికి 12వ తేదీకి దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు దర్శన సమయానికి ఒక రోజు ముందుగానే భక్తులను తిరుమలకు అనుమతించనున్నారు.
దీంతో రెండు రోజుల పాటు భక్తులు తిరుపతిలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు మూడు రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండడం వారిని ఇక్కట్లు గురిచేస్తోంది. అసలే వేసవి, ఉక్కపోత. ఆపై వసతి సౌకర్యం కూడా లభించక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు .దర్శనం టోకెన్లు పోందిన భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు టీటీడీ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!