Tirumala Rush Down: ఏడుకొండలకు తగ్గిన రద్దీ.. కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొద్దికాలంగా భారీగా భక్తులు తరలివచ్చారు. గంటల తరబడి వేచి వుండి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్కోసారి తిరుమలకు రావద్దంటూ టీటీడీ భక్తులను వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎట్టకేలకు తిరుమలలో భక్తుల తాకిడి తగ్గుముఖం పట్టింది. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న భక్తులు రద్దీ ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో రోజుల తరబడి శ్రీవారి దర్శనం కోసం వేచిచూసే పరిస్థితి నుంచి గంటల సమయంలోనే ఇప్పుడు స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు లభిస్తోంది.
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనార్దం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. 70 సంవత్సరాల క్రితం రోజుకి 600 మంది భక్తులు మాత్రమే తరలివచ్చే తిరుమలకు ప్రస్తుతం లక్ష మంది భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్ కి పూర్వం 2019 లో శ్రీవారిని 2.8 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. అటు తరువాత కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో 80 రోజుల పాటు స్వామివారి దర్శనభాగ్యం నిలిపివేశారు.
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
- Off The Record: కాపు రిజర్వేషన్స్ పై ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలనుకున్నారా..!
- Pawan Kalyan: మడ అడవుల విస్తరణలో ఏపీకి రెండో స్థానం.. పవన్ హర్షం.. గ్రేట్ గ్రీన్ వాల్పై కీలక ఆదేశాలు..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
అటు తరువాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించడంతో….ఆ ఏడాది శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 80 లక్షలకు పరిమితం అయ్యారు. అటు తరువాత ఏడాదికి కూడా కోటి నాలుగు లక్షల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. ఇలా కోవిడ్ కారణంగా 30 శాతానికి పడిపోయిన శ్రీవారి భక్తుల సంఖ్య…ఈ ఏడాది మార్చి నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితులు దృష్యా ప్రతి నిత్యం 80 నుంచి 90 వేల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించే అవకాశం వుండడంతో….గత మార్చి నుంచి ప్రతి నిత్యం కూడా అంతే సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Read Also: The Kashmir Files : భారతదేశ మూలాల కథలతో ‘కాశ్మీర్ ఫైల్స్’ బృందం
దీంతో ప్రతి నిత్యం కూడా క్యూలైనులు కిటికిటలాడాయి. వారాంతం వచ్చిందంటే చాలు క్యూలైనులు కిలోమిటర్లు మేర ఏర్పడ్డాయి. దీంతో సర్వదర్శనం కోసం 40 గంటల సమయం కూడా పట్టింది.ఇలా ఆరు నెలలుగా భక్తజనంతో కిటకిటలాడిన తిరుమలలో ఇప్పుడు భక్తులు రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. ఆరు నెలలు తరువాత మొదటిసారి క్యూ లైనులు బయటకి రాకూండా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు దర్శనాలు లేకపోవడంతో….సాధారణ పరిస్థితి రావడంతో గత ఆరు నెలలుగా శ్రీవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్న భక్తులు తాకిడి తగ్గింది. తిరుమలలో సందడి తగ్గి సాధారణ స్థితికి చేరుకుంది. సెప్టెంబర్ 18 నుంచి తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం వుండడంతో అప్పటి నుంచి తిరిగి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు టీటీడీ అధికారులు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!