Tirumala Rush Down: ఏడుకొండలకు తగ్గిన రద్దీ.. కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొద్దికాలంగా భారీగా భక్తులు తరలివచ్చారు. గంటల తరబడి వేచి వుండి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్కోసారి తిరుమలకు రావద్దంటూ టీటీడీ భక్తులను వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎట్టకేలకు తిరుమలలో భక్తుల తాకిడి తగ్గుముఖం పట్టింది. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న భక్తులు రద్దీ ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో రోజుల తరబడి శ్రీవారి దర్శనం కోసం వేచిచూసే పరిస్థితి నుంచి గంటల సమయంలోనే ఇప్పుడు స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు లభిస్తోంది.
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనార్దం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. 70 సంవత్సరాల క్రితం రోజుకి 600 మంది భక్తులు మాత్రమే తరలివచ్చే తిరుమలకు ప్రస్తుతం లక్ష మంది భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్ కి పూర్వం 2019 లో శ్రీవారిని 2.8 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. అటు తరువాత కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో 80 రోజుల పాటు స్వామివారి దర్శనభాగ్యం నిలిపివేశారు.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
అటు తరువాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించడంతో….ఆ ఏడాది శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 80 లక్షలకు పరిమితం అయ్యారు. అటు తరువాత ఏడాదికి కూడా కోటి నాలుగు లక్షల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. ఇలా కోవిడ్ కారణంగా 30 శాతానికి పడిపోయిన శ్రీవారి భక్తుల సంఖ్య…ఈ ఏడాది మార్చి నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితులు దృష్యా ప్రతి నిత్యం 80 నుంచి 90 వేల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించే అవకాశం వుండడంతో….గత మార్చి నుంచి ప్రతి నిత్యం కూడా అంతే సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Read Also: The Kashmir Files : భారతదేశ మూలాల కథలతో ‘కాశ్మీర్ ఫైల్స్’ బృందం
దీంతో ప్రతి నిత్యం కూడా క్యూలైనులు కిటికిటలాడాయి. వారాంతం వచ్చిందంటే చాలు క్యూలైనులు కిలోమిటర్లు మేర ఏర్పడ్డాయి. దీంతో సర్వదర్శనం కోసం 40 గంటల సమయం కూడా పట్టింది.ఇలా ఆరు నెలలుగా భక్తజనంతో కిటకిటలాడిన తిరుమలలో ఇప్పుడు భక్తులు రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. ఆరు నెలలు తరువాత మొదటిసారి క్యూ లైనులు బయటకి రాకూండా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు దర్శనాలు లేకపోవడంతో….సాధారణ పరిస్థితి రావడంతో గత ఆరు నెలలుగా శ్రీవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్న భక్తులు తాకిడి తగ్గింది. తిరుమలలో సందడి తగ్గి సాధారణ స్థితికి చేరుకుంది. సెప్టెంబర్ 18 నుంచి తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం వుండడంతో అప్పటి నుంచి తిరిగి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు టీటీడీ అధికారులు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!