Tirumala Rush Down: ఏడుకొండలకు తగ్గిన రద్దీ.. కారణం అదేనా?
కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొద్దికాలంగా భారీగా భక్తులు తరలివచ్చారు. గంటల తరబడి వేచి వుండి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్కోసారి తిరుమలకు రావద్దంటూ టీటీడీ భక్తులను వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎట్టకేలకు తిరుమలలో భక్తుల తాకిడి తగ్గుముఖం పట్టింది. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న భక్తులు రద్దీ ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో రోజుల తరబడి శ్రీవారి దర్శనం కోసం వేచిచూసే పరిస్థితి నుంచి గంటల సమయంలోనే ఇప్పుడు స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు లభిస్తోంది.
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనార్దం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. 70 సంవత్సరాల క్రితం రోజుకి 600 మంది భక్తులు మాత్రమే తరలివచ్చే తిరుమలకు ప్రస్తుతం లక్ష మంది భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్ కి పూర్వం 2019 లో శ్రీవారిని 2.8 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. అటు తరువాత కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో 80 రోజుల పాటు స్వామివారి దర్శనభాగ్యం నిలిపివేశారు.
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
అటు తరువాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించడంతో….ఆ ఏడాది శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 80 లక్షలకు పరిమితం అయ్యారు. అటు తరువాత ఏడాదికి కూడా కోటి నాలుగు లక్షల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. ఇలా కోవిడ్ కారణంగా 30 శాతానికి పడిపోయిన శ్రీవారి భక్తుల సంఖ్య…ఈ ఏడాది మార్చి నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితులు దృష్యా ప్రతి నిత్యం 80 నుంచి 90 వేల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించే అవకాశం వుండడంతో….గత మార్చి నుంచి ప్రతి నిత్యం కూడా అంతే సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Read Also: The Kashmir Files : భారతదేశ మూలాల కథలతో ‘కాశ్మీర్ ఫైల్స్’ బృందం
దీంతో ప్రతి నిత్యం కూడా క్యూలైనులు కిటికిటలాడాయి. వారాంతం వచ్చిందంటే చాలు క్యూలైనులు కిలోమిటర్లు మేర ఏర్పడ్డాయి. దీంతో సర్వదర్శనం కోసం 40 గంటల సమయం కూడా పట్టింది.ఇలా ఆరు నెలలుగా భక్తజనంతో కిటకిటలాడిన తిరుమలలో ఇప్పుడు భక్తులు రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. ఆరు నెలలు తరువాత మొదటిసారి క్యూ లైనులు బయటకి రాకూండా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు దర్శనాలు లేకపోవడంతో….సాధారణ పరిస్థితి రావడంతో గత ఆరు నెలలుగా శ్రీవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్న భక్తులు తాకిడి తగ్గింది. తిరుమలలో సందడి తగ్గి సాధారణ స్థితికి చేరుకుంది. సెప్టెంబర్ 18 నుంచి తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం వుండడంతో అప్పటి నుంచి తిరిగి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు టీటీడీ అధికారులు.
తాజావార్తలు
-
Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
-
Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
-
West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!