Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. భక్తుల ఆగ్రహం
శ్రీవారి ఆలయంలో వారపు సేవలు రద్దు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వేసవి శెలవుల సమయంలో సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం కేటాయించేందుకు వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చెయ్యగా….వీఐపీ బ్రేక్ దర్శనాలు కొనసాగిస్తూ…స్వామివారికి నిర్వహించే వారపు సేవలు రద్దు చెయ్యడం ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఎంతటి భక్తజన ప్రియుడో….అంతటి అలంకార ప్రియుడు….ఎంతటి అలంకార ప్రియుడో అంతటి ఉత్సవప్రియుడు…అందుకేనేమో శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కాని….అలంకరణ కాని మరే ఆలయంలో వుండవు….మరే దేవుడికి నిర్వహించరు అంటే అతిశయోక్తి కాదు. శ్రీవారికి ప్రతి నిత్యం రోండు పూటలా పూష్పాలంకరం నిర్వహిస్తూండగా….ప్రతి నిత్యం వేకువజామున నుంచి అర్దరాత్రి వరకు సేవలు నిర్వహిస్తారు.సుప్రభాత సేవతో మొదలైయ్యే స్వామివారి సేవలు…తోమాల,అర్చన,కళ్యాణోత్సవం,డోలోత్సవం,వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ,తిరిగి తోమాలసేవను నిర్వహించి….చివరగా ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఇక సోమవారం విశేష పూజ,మంగళవారం అష్టదళపాదపద్మారాధన,బుధవారం సహస్రకళషాభిషేకం,గురువారం తిరుప్పావడ,శుక్రవారం అభిషేక సేవను నిర్వహిస్తారు. ఇవి కాకుండా ప్రతి మాసంలోను వార్షిక ఉత్సవాలను శ్రీవారికి వైభవంగా నిర్వహిస్తారు. ఇలా ఏడాది అంతటా స్వామివారికి 450 వరకు ఉత్సవాలను నిర్వహిస్తుంటుంది టీటీడీ.
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
కోవిడ్ పూర్వమే శ్రీవారికి ప్రతి నిత్యం నిర్వహించే వసంతోత్సవం,ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజ,ప్రతి బుధవారం నిర్వహించే సహస్రకలశాభిషేకం సేవలను వార్షిక సేవలుగా మార్చి వేసింది టీటీడీ.ఈ మూడు సేవలలో ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తుండడంతో విగ్రహాలలో అరుగుదల కనిపిస్తూండడం….మలయప్పస్వామి వారి విగ్రహాలు 13వ శతాబ్దంలో మలయప్పకోనలో దొరికిన చారిత్రాత్మకమైన విగ్రహాలు కావడంతో….వాటికి ప్రత్యామ్నాయం కూడా లేకపోవడంతో….ఉత్సవ విగ్రహాల పరిరక్షణ కోసం ఆగమ పండితుల సూచన మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అటు తరువాత కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.
ప్రతి నిత్యం నిర్వహించే కళ్యాణోత్సవం మినహా మిగిలిన సేవలను మొదట్లో రద్దు చెయ్యగా….అటు తరువాత డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను ప్రారంభించింది.ఇక రెండు సంవత్సరాల అనంతరం ఏప్రిల్ 2వ తేదీ నుంచి శ్రీవారికి నిర్వహించే అన్ని సేవలను పున:ప్రారంభించీంది టీటీడీ. ఆర్జిత సేవలకు రెండేళ్ళ అనంతరం భక్తులును అనుమతించడం ప్రారంభించింది.మరో వైపు కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిన నేఫధ్యంలో దర్శనాల పై వున్న నియంత్రణ కూడా తొలగించింది టీటీడీ. దీంతో శ్రీవారి దర్శనానికి మార్చి,ఏప్రిల్ మాసంలోనే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం మెదలుపెట్టారు.
రెండు నెలల కాలంలోనే 40 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవుల సమయంలో భక్తులు తాకిడి మరింతగా పెరిగే అవకాశం వుండడంతో…సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వారపు సేవలను రద్దు చేసింది టీటీడీ. మంగళవారం రోజున నిర్వహించే అష్టదళపాదపద్మారాధన, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శనాలను రద్దు చేసింది. ఇప్పటికే వారాంతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చెయ్యడం….ఇప్పుడు వారపు సేవలు కూడా రద్దు చెయ్యడంతో సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం లభిస్తుందని భావిస్తోంది టీటీడీ. మరో వైపు స్వామివారికి నిర్వహించే సేవలను ….భక్తుల సౌలభ్యం పేరుతో రద్దు చెయ్యడం ఎంత వరకు సమంజసం అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి టీటీడీ పాలకమండలి నిర్ణయం మేరకు రాబోయే వారం నుంచే నూతన నిర్ణయాన్ని అమలు చెయ్యబోతుంది.
తాజావార్తలు
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో