Tirupati Stampede: టీటీడీ పాలకమండలి అత్యవసర భేటీలో కీలక నిర్ణయాలు..
- టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు..
- మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం..
- తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులకు రూ.5 లక్షలు..
- గాయపడిన భక్తులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Stampede: తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందారు.. మరికొంతమంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయగా.. ముగ్గురిపై బదిలీ వేటు వేసింది.. ఇక, తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించి, సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు.. ఆ నిర్ణయాలు టీటీడీ పాలకమండలిలో చర్చించి అమలు చేస్తారని పేర్కొన్న నేపథ్యంలో.. ఈ రోజు టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది..
Also Read
టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ముగిసిన తర్వాత నిర్ణయాలను వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించామని.. సీఎం ఆదేశాలు మేరకు మృతి చెందిన ఆరుగురు భక్తులకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని వెల్లడించారు.. ఇక, తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తాం.. గాయపడిన భక్తులకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించాం.. రేపటి నుంచి భాదిత కుటుంబానికి ఎక్స్గ్రేషియాకు సంబంధించిన చెక్కులు అందిస్తామని తెలిపారు.. మృతి చెందిన భక్తుల కుటుంబంలో విద్యార్థుల వుంటే వారికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు వారి కుటుంబంలోని వ్యక్తులకు ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.. జ్యుడిషియల్ ఎంక్వయిరీలో భాద్యులను గుర్తించి వారి పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు టీటీడీ ఛైర్మన్.. మరోవైపు.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు పాలకమండలి సభ్యులు ప్రశాంతి రెడ్డి, సుచిత్ర ఎల్లా.. 3 లక్షలు విరాళంగా ప్రకటించారు పాలకమండలి సభ్యులు ఎంఎస్ రాజు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!