TTD Vaikuntha Darshan: భక్తులకు టీటీడీ శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం..
- శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ..
- పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు..
- డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం..
- సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్న టీటీడీ
TTD Vaikuntha Darshan: శ్రీవారి భక్తులకు శుభవార్త చెబుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈసారి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ 30వ తేదీ నుండి వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీ వరకు భక్తులకు ఈ ప్రత్యేక దర్శనావకాశం అందుబాటులో ఉండనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
Read Also: CM Revanth Reddy: మోడీ దేశానికి బడే భాయ్.. రాష్ట్రాల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి..
ఇక, పది రోజుల కాలంలో 182 గంటల దర్శన సమయం ఉండగా.. అందులో 164 గంటలు సాధారణ భక్తులకే ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మొదటి 3 రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. వైకుంఠ దర్శనాల ప్రారంభయ్యే మూడు రోజులు రూ.300 దర్శనం, శ్రీవాణి దర్శనం రద్దు చేయబడ్డాయని.. జనవరి 2 నుండి టికెట్ కేటాయింపు ఉంటుందని ప్రకటించింది.. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రూ.300 దర్శన టికెట్లు 15,000 వేల చొప్పున విడుదల చేయనున్నారు.. శ్రీవాణి దర్శనాలకు సంబంధించిన టికెట్లు 1,000 చొప్పున అందుబాటులో ఉంచుతారు.. ఈ టికెట్లు సాధారణ పద్ధతిలో ఆన్లైన్ ద్వారా జారీ అవుతాయి.
Also Read
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
మొదటి మూడు రోజులకు ఈ-డిప్ సిస్టమ్ ద్వారా అంటే, డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1వ తేదీల దర్శనాలకు అనుమతి ఇస్తారు.. ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయింపు జరుగుతుంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది.. డిసెంబర్ 2న లాటరీ విధానంలో ఎంపికైన వారికి టోకెన్ల కేటాయిస్తారు.. టీటీడీ వెబ్సైట్తో పాటు.. మొబైల్ యాప్, వాట్సాప్ సిస్టమ్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్, టోకెన్ కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వారా దర్శనం సందర్భంగా స్థానికులకు ప్రత్యేక కేటాయింపులు చేసింది టీటీడీ.. తిరుమల–తిరుపతి ప్రాంత భక్తులకు.. జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకి 5,000 టోకెన్లు కేటాయించనున్నారు.
ఈ ఏడాది వైకుంఠ దర్శనాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం ఏడు రోజులపాటు రద్దు చేయబడింది. అత్యవసరంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పించబడుతుంది అని టీటీడీ స్పష్టం చేసింది.. క్యూలైన్లో నేరుగా నిల్చుని వచ్చే భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమలలో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కాగా, వైకుంఠ ద్వారా దర్శనానికి ప్రతీ ఏడాది భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలు తరలివచ్చే విషయం విదితమే.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!