Tirumala: ఇవాళ అర్ధరాత్రి తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు..
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి..
- అర్ధరాత్రి 12:01 గంటలకు తెరుచుకోనున్న వైకుంఠద్వారాలు..
- వేకువజామున 1 గంట నుంచి వీవీఐపీ దర్శనాలకు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు ఇవాళ అర్ధరాత్రి 12:01 గంటలకు తెరుచుకోనున్నాయి. ఈ పవిత్ర దర్శనాల కోసం ఇప్పటికే వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకుని క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే, రాత్రి 12:01కి వైకుంఠ ద్వారాల తెరుచుకోనుండగా.. వేకువజామున 1 గంట నుంచి వీవీఐపీ దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు.. ఆ తర్వాత టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు..
Read Also: Thalapathy Vijay : ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడిన ‘దళపతి విజయ్’
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
టీటీడీ కీలక నిర్ణయాలు
భక్తుల రద్దీ దృష్ట్యా ఈ రోజు నుంచి జనవరి 8 వరకు సిఫార్సు లేఖలపై జారీ చేసే VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.. 10 రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.. మరోవైపు, ఆలయ పరిసరాల్లోని 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.. నిన్నటి రోజు 85,823 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. 23,660 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.4.8 కోట్లుగా ప్రకటించింది టీటీడీ..
మరోవైపు, ఈ ఏడాది ఇప్పటివరకు 2 కోట్ల 63 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. అత్యధికంగా జూన్ నెలలో 24.08 లక్షల మంది భక్తులు దర్శించుకుని రికార్డు సృష్టించారు.. అత్యల్పంగా ఫిబ్రవరిలో 19.12 లక్షల మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు.. ఈ ఏడాది మొత్తం శ్రీవారికి హుండీ ద్వారా రూ.1387 కోట్ల కానుకలు సమర్పించారు భక్తులు.. అత్యధికంగా జూలైలో రూ.129.48 కోట్ల ఆదాయం లభించగా.. అత్యల్పంగా ఫిబ్రవరిలో రూ.100.69 కోట్ల ఆదాయం నమోదైంది.. అయితే, వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత పవిత్రమైనవి కావడంతో.. భక్తులు సహనంతో క్యూలైన్లలో వేచి ఉండాలని, టీటీడీ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు. దర్శనాలను ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
తాజావార్తలు
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
-
Land Grab Case: జూబ్లీహిల్స్లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!