Tirumala: ఇవాళ అర్ధరాత్రి తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు..
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి..
- అర్ధరాత్రి 12:01 గంటలకు తెరుచుకోనున్న వైకుంఠద్వారాలు..
- వేకువజామున 1 గంట నుంచి వీవీఐపీ దర్శనాలకు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు ఇవాళ అర్ధరాత్రి 12:01 గంటలకు తెరుచుకోనున్నాయి. ఈ పవిత్ర దర్శనాల కోసం ఇప్పటికే వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకుని క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే, రాత్రి 12:01కి వైకుంఠ ద్వారాల తెరుచుకోనుండగా.. వేకువజామున 1 గంట నుంచి వీవీఐపీ దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు.. ఆ తర్వాత టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు..
Read Also: Thalapathy Vijay : ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడిన ‘దళపతి విజయ్’
Also Read
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
టీటీడీ కీలక నిర్ణయాలు
భక్తుల రద్దీ దృష్ట్యా ఈ రోజు నుంచి జనవరి 8 వరకు సిఫార్సు లేఖలపై జారీ చేసే VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.. 10 రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.. మరోవైపు, ఆలయ పరిసరాల్లోని 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.. నిన్నటి రోజు 85,823 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. 23,660 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.4.8 కోట్లుగా ప్రకటించింది టీటీడీ..
మరోవైపు, ఈ ఏడాది ఇప్పటివరకు 2 కోట్ల 63 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. అత్యధికంగా జూన్ నెలలో 24.08 లక్షల మంది భక్తులు దర్శించుకుని రికార్డు సృష్టించారు.. అత్యల్పంగా ఫిబ్రవరిలో 19.12 లక్షల మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు.. ఈ ఏడాది మొత్తం శ్రీవారికి హుండీ ద్వారా రూ.1387 కోట్ల కానుకలు సమర్పించారు భక్తులు.. అత్యధికంగా జూలైలో రూ.129.48 కోట్ల ఆదాయం లభించగా.. అత్యల్పంగా ఫిబ్రవరిలో రూ.100.69 కోట్ల ఆదాయం నమోదైంది.. అయితే, వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత పవిత్రమైనవి కావడంతో.. భక్తులు సహనంతో క్యూలైన్లలో వేచి ఉండాలని, టీటీడీ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు. దర్శనాలను ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
తాజావార్తలు
-
Tollywood : అక్టోబర్లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!