TTD: తిరుమల వెళ్తున్నారా..? శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్..
- చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత..
- 12 గంటల పాటు మూతపడనున్న శ్రీవారి ఆలయం..
- 15 గంటల పాటు నిలిచిపోనున్న దర్శనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: మీరు తిరుమల వెళ్తున్నారా..? శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీ కోసమే.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని రేపు 12 గంటల పాటు మూసివేయనుంది టీటీడీ. ఆలయంలో 15 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనుంది. మరోవైపు అన్న ప్రసాద సముదాయాన్ని కూడా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు మూసి వేయనుంది టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను రద్దు చెయ్యగా.. ఎల్లుండి సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
Read Also: High Blood Pressure: నీటితో హై బీపీకి చెక్… పరిశోధనలో కీలక విషయాలు..
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
చంద్రగ్రహణం కారణంగా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎల్లుండి ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయునున్నారు. రేపటి రోజున 35 వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. సర్వదర్శనం భక్తులను ఇవాళ రాత్రికి క్యూలైన్లోకి అనుమతించడం నిలిపివేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి రోజుకు సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. రేపు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు, సర్వదర్శనం భక్తులు ,శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లను రద్దు చేసింది టీటీడీ.. ఇక ఆన్లైన్లో మూడు నెలల క్రితమే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన భక్తులకు టోకెన్ల జారీ నిలిపివేసింది టీటీడీ.. రేపు ఉదయం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవతో దర్శనాలు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవాణి దర్శన భక్తులను దర్శనానికి అనుమతించడంతో దర్శనాలు నిలిపివేయనున్నారు.
Read Also: Ghaati : షూటీ డే – 1 కలెక్షన్స్.. బయ్యర్స్ కి ఘాటు పడింది.
అటు తర్వాత శ్రీవారికి ఏకాంతంగా తోమాల, అర్చన సేవలు నిర్వహించి నైవేద్య సమర్పణ చేసిన అనంతరం ఏకాంతసేవ నిర్వహించునున్నారు. సరిగా మూడున్నర గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం రేపు రాత్రి 9:50 నుంచి ఎల్లుండి వేకువుజము ఒంటిగంట 31 నిమిషాల వరకు సంభవిస్తున్న నేపథ్యంలో ఆగమశాస్త్ర సాంప్రదాయాలను అనుసరించి 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయ ద్వారాలను మూసి వేయనున్నారు. గ్రహణం వీడిన అనంతరం ఎల్లుండి ఉదయం 3 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి ముందుగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వామివారికి ఏకాంతంగా సుప్రభాత, తోమాల, అర్చన సేవలు నిర్వహించి నైవేద్య సమర్పణ చేసిన అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించునుంది టీటీడీ. రేపటి రోజు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేయగా ఎల్లుండికి సంబంధించి వీఐపీ బ్రేక్ దర్శనలను రద్దు చేసింది. ఇక అన్న ప్రసాద సముదాయాన్ని రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు మూసివేయనున్నారు. మరోవైపు భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది టీటీడీ. 30 వేల ఆహార పొట్లాలను ముందస్తుగానే సిద్ధం చేసి రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు వైభవ మండపం, పీఏసీ ఒకటి, రాంబగిచా బస్టాండ్, ఏఎన్ సి వంటి ప్రాంతాలలో పంపిణీ చేయనున్నారు. గ్రహణం కారణంగా 12 గంటల పాటు ఆలయ ద్వారాలు మూసివేస్తుండడం.. 15 గంటల పాటు దర్శనాలు నిలిపివేస్తున్న నేపథ్యంలో తిరుమల విచ్చేసిన భక్తులు అందుకు అనుగుణంగా తమ పర్యటనను ప్రణాళికలు వేసుకోవాలని సూచిస్తుంది టీటీడీ..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..