Tigers Hulchul: తెలుగు రాష్ట్రాల్లో చిరుతల భయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరణ్యాల్లో వుండాల్సిన వన్యప్రాణులు జనారణ్యాలకు చేరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరుతలు, పులుల సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గాలిబ్ నగర్ లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను చిరుత వెంబడించింది. బైక్ సైలెన్సర్ రేజ్ చేస్తూ… ప్రాణాలతో బయట పడ్డారు యువకులు. చిరుత సంచరిస్తున్న విషయాన్ని పోలీసులు, అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు ఆ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు గుర్తించారు. చిరుత సంచరిస్తున్న విషయం తెలిసి గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చిరుత సంచారంపై భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Kaali Poster: కాళీ పోస్టర్పై వివాదం.. నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
మరోవైపు తిరుపతిలోని ఎస్వీ జూపార్క్ సమీపంలో చిరుతలు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆప్రాంతంలోని జనం భయాందోళనలకు గురవుతున్నారు. రెండురోజుల క్రితం తిరుమల కొండ ప్రాంతంలో చిరుత కనిపించింది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లాలోకి పులి ప్రవేశించిన సంగతి తెలిసిందే. నక్కపల్లి మండలం తిరుపతిపాలెం దగ్గర పులి అడుగుజాడలు గుర్తించారు. తటపర్తి దగ్గర గేదెపై పులి దాడి చేసింది. పులి సంచారంతో పాయకరావుపేట పరిధిలోని శ్రీరామపురం, తిరుపతిపాలెం, తడపర్తి, వెంకటాపురం గ్రామాల్లో టెన్షన్ ఏర్పడింది. దీంతో గ్రామస్తులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.అనకాపల్లికి వచ్చిన పులి కాకినాడలో సంచరించే పులి ఒకటే అని తేలింది. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సమీపంలోని కుచ్చులకొండ నుంచి తాండవ నది పరివాహక ప్రాంతానికి వెళుతూ తుని-కొట్టాం రోడ్డుపై పులి చేరుకుందని అధికారులు చెబుతున్నారు. నెలరోజులకు పైగా బెంగాల్ టైగర్ టెన్షన్ పెడుతోంది. పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు.
Gold Rates: స్థిరంగా బంగారం ధరలు.. మరి వెండి?
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!