Tiger Hunt: పెద్ద పులి ఎక్కడ? జనం వెన్నులో వణుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా వాసులకు మూడు వారాలుగా గుండెల్లో దడపుట్టిస్తోంది ఆ పెద్దపులి. తాజాగా శంఖవరం మండలం కొంతంగి ఎర్రకొండ పై పులి సంచారం కనిపించిందంటున్నారు. పులి కనిపించిందని చెప్తున్న కొండపై జీడిపిక్కల కోసం వెళ్ళారు కొందరు యువకులు. భయంతో పరుగులు తీసిన యువకులు ఈ సంగతి ఊళ్ళోకి వచ్చి చెప్పారు. గత కొద్దిరోజులుగా ఎక్కడో చోట అలజడి కలిగిస్తూనే వుంది. దానిని బంధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించడం లేదు. దీంతో చీకటి పడ్డాక గడప దాటి కాలు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు జనం. పులి ఎటు నుంచి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం లోగానే తమ పనులు ముగించుకుని.. తలుపులేసుకుని బిక్కబిక్కుమంటున్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో గత మూడు వారాలుగా పెద్దపులి సంచరిస్తుంది. గత నెల 23న ఒమ్మంగి, శంకర్ల పూడి, పొదురుపాక సరిహద్దుల్లో పెద్దపులిని చూశారు రైతులు. ఆ తర్వాత పోతులూరు, శరభవరం ప్రాంతాల్లో తిరుగుతూ పశువులపై దాడి చేసింది. ఈ నెల 4 వరకు దాదాపు 10 పశువులపై దాడి చేసింది పులి. అందులో 5 పశువులు చనిపోయాయి. ఆ తర్వాత పులిజాడ ఎక్కడా కనిపించలేదు. ఊద రేవుడి మెట్టపై పెద్దపులి ఉన్నట్టు అంచనా వేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. మూడు రోజుల పాటు పెద్ద శంకర్ల పూడి గ్రామ పరిసరాల్లో తిరిగినట్టు భావిస్తున్నారు. పొడి వాతావరణం కారణంగా పులి అడుగు జాడలు కనిపించడం లేదు. అలాగే, గతంలో పులి గాండ్రింపులు వినిపించేవని… ఇప్పుడు లేదని చెబుతున్నారు రైతులు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
పెద్దపులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెద్దపులి కదలికలు గల ప్రాంతాల్లో నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు. మేక, గొర్రె, లేగదూడలను ఎరగా వేశారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి… పులి కదలికల్ని కనిపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ… ఎక్కడా పెద్దపులి జాడ కనిపించలేదు. వారం క్రితం బోను దగ్గరికి వచ్చినా… ఎర జోలికి వెళ్లలేదు పెద్దపులి. తర్వాత పాండవులుపాలెం చెరువు ప్రదేశంలో పులి సంచరించినట్టు గుర్తించారు అటవీ శాఖ అధికారులు.
ప్రత్తిపాడు మండల ప్రజలకు మూడు వారాలుగా పులి భయం పట్టుకుంది. ఒంటరిగా వెళ్లాలంటే వణికిపోతున్నారు. చీకటిపడితే చాలు గుమ్మం దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పొలాల్లో ఉండే పశువులను కొందరు ఇళ్లకు తెచ్చేశారు. పులికి మత్తుమందు ఇచ్చి పట్టుకోడానికి శ్రీశైలం నుంచి షూటర్లు వచ్చారు. కానీ… వారం రోజులుగా పులి జాడ లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు ఏకంగా పొలాలకు వెళ్లడం మానేశారు. తొలకరి సీజన్ కావడంతో పొలం పనులు ప్రారంభించాల్సి ఉంది. కాని పులి భయంతో… ఆ ఆలోచన విరమించుకున్నారు చాలా మంది. మొత్తానికి ఓ వైపు జనాన్ని భయపెడుతూ… మరోవైపు ఫారెస్ట్ అధికారుల్ని ముప్పతిప్పలు పెడుతోంది పెద్దపులి. మళ్లీ పులి కదలికలకు సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా దొరికితే… దానిని బంధిస్తామంటున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!