Tiger Hunt: పెద్ద పులి ఎక్కడ? జనం వెన్నులో వణుకు
కాకినాడ జిల్లా వాసులకు మూడు వారాలుగా గుండెల్లో దడపుట్టిస్తోంది ఆ పెద్దపులి. తాజాగా శంఖవరం మండలం కొంతంగి ఎర్రకొండ పై పులి సంచారం కనిపించిందంటున్నారు. పులి కనిపించిందని చెప్తున్న కొండపై జీడిపిక్కల కోసం వెళ్ళారు కొందరు యువకులు. భయంతో పరుగులు తీసిన యువకులు ఈ సంగతి ఊళ్ళోకి వచ్చి చెప్పారు. గత కొద్దిరోజులుగా ఎక్కడో చోట అలజడి కలిగిస్తూనే వుంది. దానిని బంధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించడం లేదు. దీంతో చీకటి పడ్డాక గడప దాటి కాలు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు జనం. పులి ఎటు నుంచి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం లోగానే తమ పనులు ముగించుకుని.. తలుపులేసుకుని బిక్కబిక్కుమంటున్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో గత మూడు వారాలుగా పెద్దపులి సంచరిస్తుంది. గత నెల 23న ఒమ్మంగి, శంకర్ల పూడి, పొదురుపాక సరిహద్దుల్లో పెద్దపులిని చూశారు రైతులు. ఆ తర్వాత పోతులూరు, శరభవరం ప్రాంతాల్లో తిరుగుతూ పశువులపై దాడి చేసింది. ఈ నెల 4 వరకు దాదాపు 10 పశువులపై దాడి చేసింది పులి. అందులో 5 పశువులు చనిపోయాయి. ఆ తర్వాత పులిజాడ ఎక్కడా కనిపించలేదు. ఊద రేవుడి మెట్టపై పెద్దపులి ఉన్నట్టు అంచనా వేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. మూడు రోజుల పాటు పెద్ద శంకర్ల పూడి గ్రామ పరిసరాల్లో తిరిగినట్టు భావిస్తున్నారు. పొడి వాతావరణం కారణంగా పులి అడుగు జాడలు కనిపించడం లేదు. అలాగే, గతంలో పులి గాండ్రింపులు వినిపించేవని… ఇప్పుడు లేదని చెబుతున్నారు రైతులు.
Also Read
- CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
- Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
పెద్దపులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెద్దపులి కదలికలు గల ప్రాంతాల్లో నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు. మేక, గొర్రె, లేగదూడలను ఎరగా వేశారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి… పులి కదలికల్ని కనిపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ… ఎక్కడా పెద్దపులి జాడ కనిపించలేదు. వారం క్రితం బోను దగ్గరికి వచ్చినా… ఎర జోలికి వెళ్లలేదు పెద్దపులి. తర్వాత పాండవులుపాలెం చెరువు ప్రదేశంలో పులి సంచరించినట్టు గుర్తించారు అటవీ శాఖ అధికారులు.
ప్రత్తిపాడు మండల ప్రజలకు మూడు వారాలుగా పులి భయం పట్టుకుంది. ఒంటరిగా వెళ్లాలంటే వణికిపోతున్నారు. చీకటిపడితే చాలు గుమ్మం దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పొలాల్లో ఉండే పశువులను కొందరు ఇళ్లకు తెచ్చేశారు. పులికి మత్తుమందు ఇచ్చి పట్టుకోడానికి శ్రీశైలం నుంచి షూటర్లు వచ్చారు. కానీ… వారం రోజులుగా పులి జాడ లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు ఏకంగా పొలాలకు వెళ్లడం మానేశారు. తొలకరి సీజన్ కావడంతో పొలం పనులు ప్రారంభించాల్సి ఉంది. కాని పులి భయంతో… ఆ ఆలోచన విరమించుకున్నారు చాలా మంది. మొత్తానికి ఓ వైపు జనాన్ని భయపెడుతూ… మరోవైపు ఫారెస్ట్ అధికారుల్ని ముప్పతిప్పలు పెడుతోంది పెద్దపులి. మళ్లీ పులి కదలికలకు సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా దొరికితే… దానిని బంధిస్తామంటున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
-
CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
-
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
-
Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!