జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్తో తీరనున్న సొంతింటి కల
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ మధ్య తరగతి ప్రజలకు తీరనున్న సొంతింటి కల ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించింది. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్థలాలు, ప్లాట్లు కేటాయించి వారి సొంతింటికలను సాకారం చేసే దిశగా జగన్ సర్కార్ పయనిస్తోంది. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైఎస్ఆర్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఔట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి ననుంచే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్ఐజీ (మిడిల్ ఇన్కం గ్రూప్ లేఔట్) పథకం అమలు కానుంది. రేపు క్యాంప్ కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. రూ. 18 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన అర్హులైన కుటుంబాలకు రాష్ట్రంలో వారు ఉంటున్న ప్రాంతంలో సరసమైన ధరలకు నివాస స్ధలాల కేటాయింపు జరిగేలా చూస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఔట్లో 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేటుతో కేటాయించనున్నారు. అన్ని పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పట్టణ ప్రణాళికా విభాగాల నియామాల మేరకు ఒక ఏడాది కాలంలో ఈ లేఔట్లను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నారు.
Read Also: కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూసూద్ సోదరి
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఒక సంవత్సర వ్యవధిలో 4 వాయిదాలలో డబ్బు చెల్లించే సౌకర్యం కల్పించనున్నారు. చెల్లింపు పూర్తయిన వెంటనే ప్లాట్లను అభివృద్ధి చేసి లబ్ధిదారులకు స్వాధీనపరుస్తారు. దరఖాస్తుతో పాటు ప్లాటు విలువలో 10 శాతం, అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్ తేది లోపు ఏది ముందయితే అప్పటికి మిగిలిన 30 శాతం చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఏకమొత్తంగా చెల్లించిన వారికి 5 శాతం మేరకు ఆకర్షణీయమైన రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. https://migapdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది.
లేఔట్ల ప్రత్యేకతలు..
న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్ డీడ్, గవర్నమెంటే లేఔట్ చేస్తుంది.కుటుంబాల అవసరాలను బట్టి 150,200 మరియు 240 చదరపు గజాల స్ధలాలు ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తుంది. పర్యావరణ హితంగా ఉండేలా లేఔట్ల విస్తీర్ణంలో 50 శాతం వరకు స్థలం సామాజిక అవసరాలకు కొంత స్థలాన్ని కేటాయిస్తారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్తో ఫుట్పాత్లు, ఎవెన్యూ ప్లాంటేషన్ మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్ధ, వరద నీటి డ్రెయిన్లు, విద్యుదీకరణ మరియు వీధి దీపాలతో కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. పార్కులు, ఆట స్ధలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకు మరియు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేకంగా స్థలాల కేటాయింపు ఉంటుంది. లేఔట్ నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరియు పట్టణాభివృద్ది సంస్థల ద్వారా సంయుక్త నిర్వహణ చేపడతారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో