NTV Telugu Site icon

జీవో నెంబర్‌ 2ను వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్‌ 2ను ప్రవేశపెట్టింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సర్పంచులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్‌ 2 పంచాయతీ రాజ్‌ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్‌ 2ను సస్పెండ్‌ చేసింది. అయితే దీనిపై మరోసారి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్‌ 2ను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది.