ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ఓ ఎత్తు అయితే.. జీవోలను ఆన్లైన్లో పెట్టకూడదంటూ తీసుకున్న నిర్ణయం మరో ఎత్తుగా కనిపిస్తోంది. GOIR వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచే ప్రక్రియ 2008 నుంచి ప్రారంభమైంది. ఈ ఆనవాయితీని జగన్ సర్కార్ పక్కకు పెట్టింది. ఈ విధానానికి స్వస్తి పలకాలంటూ అన్ని శాఖల కార్యదర్శలకు మెమో పంపింది. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైనులో పెట్టకూడదని డిసైడ్ అయినట్టు స్పష్టం చేసింది ఏపీ సర్కార్. ప్రభుత్వం ఇంత సడెన్గా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే అంశంపై వివిధ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలతో ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుందనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా APSDC విషయంలో ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కొంది. ఆర్థికపరమైన విషయాల్లోనూ తీవ్ర విమర్శలకు గురైంది. అలాగే కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ జీవో విడుదల చేసిన వెంటనే దాన్ని బేస్ చేసుకుని వెంటనే కోర్టుకు వెళ్తోన్న సంఘటనలూ ఎక్కువ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ తలనొప్పులు లేకుండా ఉండాలంటే అసలు కీలక ఉత్తర్వులు పబ్లిక్ డొమైనులో పెట్టకుండా ఉంటే బెటరేమోననే ప్రతిపాదనకు మొగ్గు చూపినట్టు సమాచారం. అయితే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారా..? అని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బ్లాంక్ జీవోల విషయంలో పెద్ద రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో.. జీవోలను పబ్లిక్ డొమైనులో పెట్టకూడదన్న నిర్ణయం ఇంకెంత రచ్చకు దారి తీస్తుందో చూడాలి..
- Tags
- Andhra Pradesh
- APSDC
- cm jagan
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!