Mahanadu: టీడీపీ వేడుకకు సర్వం సిద్ధం.. ఒంగోలు చేరుకుంటున్న పసుపుదండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. ఒంగోలు సమీపంలో జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ సర్వం సిద్ధం చేసింది. మహానాడులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఒంగోలు బాట పట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 10 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మహానాడులో పాల్గొనేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఒంగోలు చేరుకున్నారు. మంగళగిరి నుంచి ఆయన కార్లు, బైక్ ర్యాలీలతో ఒంగోలు చేరుకున్నారు. ఆయరకు ఉమ్మడి జిల్లా సరిహద్దు మార్టూరు నుంచి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మార్గం మధ్యలో చిలకలూరిపేట, మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు ఆగి కాసేపు ప్రసంగించారు.
మరోవైపు ఒంగోలులో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మహానాడులో ప్రవేశపెట్టే పలు కీలక తీర్మానాలపై పోలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నిర్ణయించనున్నారు. మహానాడులో జనసేనతో పొత్తు అంశంపై స్పష్టత వచ్చే అవకాశముందని టాక్ నడుస్తోంది. టీడీపీ శ్రేణుల్లో ఇప్పటికే జనసేనతో పొత్తు ఉంటే లాభమనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బీజేపీతో ఎటువంటి వైఖరి అవలంభిస్తారో కూడా మహానాడు వేదికగా స్పష్టత వచ్చే అవకాశముంది.
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
అయితే అంతకుముందు చంద్రబాబు కాన్వాయ్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. చంద్రబాబు ప్రయాణించే కారులో ఏసీ పనిచేయకపోవడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. తీవ్ర ఎండలకు తోడు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసీ పనిచేయలేదు. దీంతో ప్రత్యామ్నాయం లేక పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కారెక్కి చంద్రబాబు కొంతదూరం ప్రయాణించారు. అయితే కాన్వాయ్ వాహనాల కండిషన్ బాగోలేకపోవడంపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!