మేము బిచ్చమెత్తుకుంటే మీకెంటీ..?: టీఆర్ఎస్కు సజ్జల కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం నుంచి రావల్సినవి తెచ్చుకోవడం మా హక్కు అని కేసీఆర్ అన్నారని, నిధులు రాబట్టే విషయంలో మిగిలిన వారు కూడా అలాగే వ్యవహరిస్తారని మేము బిచ్చమెత్తుకుంటే మీకెంటని తెలంగాణ టీఆర్ ఎస్ నేతలకు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నేతలు ఈ విధంగా మాట్లాడటం వారి రాజకీయ అజ్ఞానమే అవుతుం దన్నారు. కేంద్రం నుంచి నిధులను రావాల్సిన పద్ధతుల్లో రాబట్టు కుంటున్నామన్నారు. వారు ఎలా పోవాలో వారు చూసుకోవాలి, మేము ఎలా పోతే వారికేమిటీ అని ఆయన ప్రశ్నించారు. వారి సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశా రు. వారి సమస్యల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే తెలం గాణ నేతలు ఇలా ఎపీ గురించి మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ కు ఏపీలో ప్రజెన్స్ లేదన్నారు.ఇక్కడ ప్రజెన్స్ లేని పార్టీ ఇక్కడి వాటి గురించి ఇక్కడి వాటి గురించి కామెంట్ చేయడం సరైంది కాదన్నారు.
అన్ని రిసోర్సులు హైదరాబాద్లోనే ఉన్నాయని రాష్ట్రాన్ని విడదీసీ అన్యాయం చేశారని మేం ఎప్పుడైనా అన్నామ అన్నారు. అనంతరం టీడీపీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. విద్యుత్ రంగంలో మా హయాంలో ఎంత అప్పు ఉందో…మా హయాంలో అప్పులు ఎన్ని ఉన్నాయో పయ్యావుల చెప్పాలన్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేస్తూ అధిక భారాన్ని తగ్గించుకుంటున్నామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమనేది రాజకీయ విధానాలకు సంబంధించిన విషయం అన్నారు. మీటర్లకు రైతులకు సబ్సీడీకి సంబంధం లేదన్నారు. మీటర్లు పెట్టాలన్న కేంద్రం రాష్ట్రాలకు చెప్పింది.దాన్ని మేము ఫాలో అయితే తప్పేముందన్నారు. మీటర్ల బిగింపు వల్ల రైతులకు దీనివల్ల నష్టం జరగదని పేర్కొన్నారు. దేని కెంత విద్యుత్ ఇస్తున్నామో తెలిసేందుకే మీటర్ల బిగిస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
ఇక్కడ తెదేపా ఎలా మాట్లాడుతుందో అక్కడ టీఆర్ఎస్ కూడా అలాగే మాట్లాడుతుందన్నారు. ఈసందర్భంగా విభజన చట్టంలోని అంశా లపై ఆయన మాట్లాడారు.స్పెషల్ స్టేటస్ ,విభజన చట్టం లోని అంశాలు సదరన్ జోన్ సమావేశంలో ప్రస్తావిస్తామని సజ్జల తెలిపారు. సదరన్ జోన్ సమావేశానికి సీఎం జగన్ తప్పక పాల్గొంటారన్నారు. మూడు రాజధానుల అంశాలకు నిధులివ్వాలని కూడా సమావేశంలో కేంద్రాన్ని కోరతామన్నారు. టీడీపీ దిగిపోయే నాటికి విద్యుత్ రంగంలో 70 వేల కోట్లు పైనే అప్పులు పెట్టి పోయిందన్నారు. 2.49 పైసలకు సెకీ ద్వారా సోలార్ విద్యుత్ను తీసుకొస్తున్నామన్నారు. వచ్చే 25 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ ను రైతుల హక్కుగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని సజ్జల తెలిపారు.
తాజావార్తలు
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!