Tdp Protest: అసెంబ్లీ కాదు.. జగన్ భజన సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతూనే వున్నారు. అసెంబ్లీ జగన్ భజన సభలా మారింది. సభలో మాట్లాడకుండా మా గొంతు నొక్కారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప. కల్తీ సారా,నకీలీ మద్యంపై సభలో చర్చించాలని ఆందోళన చేశాం. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలు చెప్పారు. ఇకనుంచి ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తాం.
సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారు. ప్రతి రోజు మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి గొంతు నొక్కారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం అన్నారు భవానీ.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
సమావేశాల చివరి రోజు కూడా అసెంబ్లీలో కల్తీ నాటుసారాపై చర్చకు అవకాశం ఇవ్వలేదు. మహిళల తాళిబొట్లు తెగిపోయాయని సభలో తాళిబొట్ల ప్రదర్శన పెట్టినా చర్చ చేపట్టకపోగా మాపై ఎదురుదాడికి దిగారు. భర్తల్ని కోల్పోయిన మహిళల బాధ తెలపాలనే తాళిబొట్లు ప్రదర్శించాం. వైసీపీ ఎమ్మెల్సీలు మా చేతిలో తాళిబొట్లు లాక్కుని నేలకేసి కొట్టారన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. 42 మంది ప్రాణాలు ఎందుకు పోయాయో ప్రభుత్వం చట్టసభల్లో సమాధానం చెప్పలేదు. పులివెందులలో కల్తీసారా బయటపడినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?