Payyavula Keshav: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payyavula Keshav: గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదు..? అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. ఈరోజు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్.. ఇక, గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టీడీపీ అసభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన విషయం విదితమే కగా.. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్న ప్రభుత్వం.. ఈ విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.. సుప్రీం పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేదు..? పాత గవర్నర్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం అలాంటి తప్పే ఇవాళ మళ్లీ చేసిందన్నారు.
Read Also: Somu Veerraju: సీఎం జగన్కు సోము వీర్రాజు లేఖ.. దానిపై అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలి..
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఇక, గవర్నర్తో ముఖ్యమంత్రి ని పొగిడించటమేంటి? అని నిలదీశారు పయ్యావుల.. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా లేక ముఖ్యమంత్రి పెద్దా ? అని ఎద్దేవా చేశారు. ప్రథమ పౌరుడితో సీఎంని పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.. గవర్నర్ను కూడా స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారు.. ఇది సభా నిబంధనలకు విరుద్ధం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయి.. కానీ, శాంతి భద్రతల అంశం ఎక్కడా గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్తో చెప్పించే ప్రయత్నం చేశారు.. సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేసిన గవర్నర్తోనూ రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.
మరోవైపు.. గవర్నర్ ప్రసంగంపై టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. విభజన చట్టం 10 ఏళ్ల కాల పరిమితి ముగుస్తున్నా, గవర్నర్ ప్రసంగంలో దానిపై ప్రస్తావన లేదని విమర్శించారు. ఈ ఎన్నికల కాలానికి పోలవరం పూర్తికాదనే అసమర్ధతను ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో చెప్పించారన్న ఆయన.. అసత్యాలు చదవలేక అనేకసార్లు గవర్నర్ కూడా ఇబ్బంది పడ్డారన్నారు నిమ్మల.. ఇక, గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి రంగుల పిచ్చ, పేర్ల పిచ్చ తప్ప మరేం లేదని విమర్శలు గుప్పించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. తన చేత ఇన్ని అసత్యాలు పలికించినందుకు గవర్నర్ కూడా ఇంటికి వెళ్లి బాధపడి ఉంటారన్న ఆయన.. వివిధ పథకాలకు సంబంధించి గవర్నర్తో ప్రభుత్వం చెప్పించిన లెక్కలన్నీ అంకెల గారడీయేనని కొట్టిపారేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!