Payyavula Keshav: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదు..?
Payyavula Keshav: గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదు..? అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. ఈరోజు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్.. ఇక, గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టీడీపీ అసభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన విషయం విదితమే కగా.. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్న ప్రభుత్వం.. ఈ విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.. సుప్రీం పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేదు..? పాత గవర్నర్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం అలాంటి తప్పే ఇవాళ మళ్లీ చేసిందన్నారు.
Read Also: Somu Veerraju: సీఎం జగన్కు సోము వీర్రాజు లేఖ.. దానిపై అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలి..
Also Read
- Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
- Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
- Off The Record : ఎమ్మెల్యే పేరు చెప్పి పత్తిపాడు నియోజకవర్గంలో కమీషన్ల దందా
- CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ఇక, గవర్నర్తో ముఖ్యమంత్రి ని పొగిడించటమేంటి? అని నిలదీశారు పయ్యావుల.. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా లేక ముఖ్యమంత్రి పెద్దా ? అని ఎద్దేవా చేశారు. ప్రథమ పౌరుడితో సీఎంని పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.. గవర్నర్ను కూడా స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారు.. ఇది సభా నిబంధనలకు విరుద్ధం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయి.. కానీ, శాంతి భద్రతల అంశం ఎక్కడా గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్తో చెప్పించే ప్రయత్నం చేశారు.. సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేసిన గవర్నర్తోనూ రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.
మరోవైపు.. గవర్నర్ ప్రసంగంపై టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. విభజన చట్టం 10 ఏళ్ల కాల పరిమితి ముగుస్తున్నా, గవర్నర్ ప్రసంగంలో దానిపై ప్రస్తావన లేదని విమర్శించారు. ఈ ఎన్నికల కాలానికి పోలవరం పూర్తికాదనే అసమర్ధతను ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో చెప్పించారన్న ఆయన.. అసత్యాలు చదవలేక అనేకసార్లు గవర్నర్ కూడా ఇబ్బంది పడ్డారన్నారు నిమ్మల.. ఇక, గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి రంగుల పిచ్చ, పేర్ల పిచ్చ తప్ప మరేం లేదని విమర్శలు గుప్పించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. తన చేత ఇన్ని అసత్యాలు పలికించినందుకు గవర్నర్ కూడా ఇంటికి వెళ్లి బాధపడి ఉంటారన్న ఆయన.. వివిధ పథకాలకు సంబంధించి గవర్నర్తో ప్రభుత్వం చెప్పించిన లెక్కలన్నీ అంకెల గారడీయేనని కొట్టిపారేశారు.
తాజావార్తలు
-
Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
-
Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
-
Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
-
Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
-
Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?