Kala Venkatrao: పూటకో మాట.. రోజుకో పాట… అదే వైసీపీ ఎజెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయ పార్టీల మధ్య రోజూ మాటల యుద్ధం సాగుతూనే వుంటుంది. తాజాగా ఏపీ విభజన వివాదం రాజుకుంది. వైసీపీ నేతలు ఏపీ, తెలంగాణ కలిసి పోతే స్వాగతిస్తామని కామెంట్లు చేశారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదటగా స్వాగతించేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని, కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా పార్టీ, మా ప్రభుత్వ విధానమని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సజ్జల సమైక్య కామెంట్లపై స్పందించింది టీడీపీ.
Read Also: Air Pollution : ముంబైలో పడిపోయిన గాలినాణ్యత.. ఢిల్లీని పక్కకు నెట్టి మరీ
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సజ్జల సలహాలతో జగన్ పాలనతో రాష్ట్రంలో పీకల్లోతున కూరుకు పోయింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసి రాష్ట్రానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మరోమారు తీరని ద్రోహం చేసింది. విభజన కేసులు మూసేయాలన్న తాజా అఫిడవిట్ తో రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్ష కోట్ల ఆస్తులు చేజేతులా వదులుకున్నట్టైంది. ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకు వైసీపీ నేతలు కొత్త నాటకానికి తెర లేపారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలక పాత్ర పోషించింది వైసిపినే అన్నారు. షెడ్యూలు 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించవచ్చని చెప్పింది జగన్ రెడ్డి కాదా..?
ఆంధ్రప్రదేశ్ ను విభజించవద్దని పార్లమెంటులో టీడీపీ ఎంపిలు పోరాటం చేస్తే ఆ సమయంలో లోక్ సభలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విభజనకు మద్దతు తెలపలేదా..? రాష్ట్ర విభజన అడ్డుకున్నందుకు టీడీపీ ఎంపీలపై తెలంగాణ ఎంపీలు భౌతిక దాడులకు దిగితే జగన్ రెడ్డి మౌనంగా ఉండి.. వారికి మద్దతివ్వలేదా..? బెంచి కింద దాక్కుని విభజన వాదులకు మద్దతు తెలిపిన చరిత్ర జగన్ రెడ్డిది కాదా? పూటకో మాట, ప్రాంతానికో విధానం… వెరసి అవకాశవాదమే వైసీపీ ఎజెండా అని ఎద్దేవా చేశారు కళా వెంకట్రావు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అటు తెలంగాణ లోనూ టీఆర్ఎస్ నేతల నుంచి గట్టి కౌంటర్లు పడుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు వైసీపీ తీరుపై మండిపడుతున్నారు.
Read Also: Amaravati : చిట్ ఫండ్ కేసులపై ఓ కన్నేయండి
తాజావార్తలు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!