Kala Venkatrao: పూటకో మాట.. రోజుకో పాట… అదే వైసీపీ ఎజెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయ పార్టీల మధ్య రోజూ మాటల యుద్ధం సాగుతూనే వుంటుంది. తాజాగా ఏపీ విభజన వివాదం రాజుకుంది. వైసీపీ నేతలు ఏపీ, తెలంగాణ కలిసి పోతే స్వాగతిస్తామని కామెంట్లు చేశారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదటగా స్వాగతించేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని, కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా పార్టీ, మా ప్రభుత్వ విధానమని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సజ్జల సమైక్య కామెంట్లపై స్పందించింది టీడీపీ.
Read Also: Air Pollution : ముంబైలో పడిపోయిన గాలినాణ్యత.. ఢిల్లీని పక్కకు నెట్టి మరీ
Also Read
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సజ్జల సలహాలతో జగన్ పాలనతో రాష్ట్రంలో పీకల్లోతున కూరుకు పోయింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసి రాష్ట్రానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మరోమారు తీరని ద్రోహం చేసింది. విభజన కేసులు మూసేయాలన్న తాజా అఫిడవిట్ తో రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్ష కోట్ల ఆస్తులు చేజేతులా వదులుకున్నట్టైంది. ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకు వైసీపీ నేతలు కొత్త నాటకానికి తెర లేపారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలక పాత్ర పోషించింది వైసిపినే అన్నారు. షెడ్యూలు 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించవచ్చని చెప్పింది జగన్ రెడ్డి కాదా..?
ఆంధ్రప్రదేశ్ ను విభజించవద్దని పార్లమెంటులో టీడీపీ ఎంపిలు పోరాటం చేస్తే ఆ సమయంలో లోక్ సభలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విభజనకు మద్దతు తెలపలేదా..? రాష్ట్ర విభజన అడ్డుకున్నందుకు టీడీపీ ఎంపీలపై తెలంగాణ ఎంపీలు భౌతిక దాడులకు దిగితే జగన్ రెడ్డి మౌనంగా ఉండి.. వారికి మద్దతివ్వలేదా..? బెంచి కింద దాక్కుని విభజన వాదులకు మద్దతు తెలిపిన చరిత్ర జగన్ రెడ్డిది కాదా? పూటకో మాట, ప్రాంతానికో విధానం… వెరసి అవకాశవాదమే వైసీపీ ఎజెండా అని ఎద్దేవా చేశారు కళా వెంకట్రావు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అటు తెలంగాణ లోనూ టీఆర్ఎస్ నేతల నుంచి గట్టి కౌంటర్లు పడుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు వైసీపీ తీరుపై మండిపడుతున్నారు.
Read Also: Amaravati : చిట్ ఫండ్ కేసులపై ఓ కన్నేయండి
తాజావార్తలు
-
Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
-
Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
-
Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
-
Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?