Amaravati : చిట్ ఫండ్ కేసులపై ఓ కన్నేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati : పెండింగ్ లో ఉన్న చిట్ ఫండ్ కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అధికారులకు సూచించారు. గురువారం ఆయన రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్లు స్టాంపుల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన రిజిస్ట్రేషన్లు స్టాంపుల ఐజీ, అదనపు ఐజీ, డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు. రిజిస్ట్రేషన్ల ద్వారా కొన్ని జిల్లాల రెవెన్యూ లక్ష్యాలను ఇంకా చేరుకోలేదని సమావేశంలో స్పష్టీకరించారు. కాకినాడ, విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, శ్రీకాకుళంలను ప్రీమియం రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రజత్ భార్గవ సూచించారు. అలాగే, డిసెంబరు 31 లోగా ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లు ఏర్పాటు కోసం భవనాలను గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Read Also: Air Pollution : ముంబైలో పడిపోయిన గాలినాణ్యత.. ఢిల్లీని పక్కకు నెట్టి మరీ
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
ఈ కేంద్రాలన్నీ అవినీతి రహితంగా సేవలందించేలా తీర్చిదిద్దాలని రజత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రెండు వేల గ్రామ వార్డు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల సేవలు అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు అవసరమైన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. చిట్ ఫండ్ నిర్వాహకులపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న చిట్ ఫండ్ కేసులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రజత్ భార్గవ అధికారులకు సూచించారు. చిట్ ఫండ్ కంపెనీలకు కొత్తగా అనుమతులు జారీ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త భవనాల్లోకి మార్పులు చేయాలన్నారు. అలాగే రికార్డులను డిజిటలైజ్ చేయాలంటూ ఆదేశించారు. రెవెన్యూ వసూళ్లలో ముందు వరుసలో విశాఖ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటించారు.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!