భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు: టీడీపీ నేత అనురాధ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాను వైసీపీ కార్యకర్తలే ఛీ కొడుతుంటే పారిపోయి తమ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి రోజా మాట్లాడటం సిగ్గుచేటు అని అనురాధ ఆరోపించారు. వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఫస్ట్రేషన్తో రోజా తమ మేడమ్పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని.. రోజా నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. సూర్పణఖకు పట్టిన గతే రోజాకు టీడీపీ మహిళలు పట్టిస్తారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
Read Also: నారా భువనేశ్వరికి రోజా కౌంటర్
Also Read
- Gannavaram Bus Accident: గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్పై బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
- Off The Record: కాపు రిజర్వేషన్స్ పై ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలనుకున్నారా..!
చిత్తూరు జిల్లాలో వరదలు వస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ మేడమ్ భువనేశ్వరి స్వయంగా స్పందించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బాధితులకు సహాయం అందించారని అనురాధ వెల్లడించారు. భువనేశ్వరి తన వంతుగా రూ.49 లక్షలు ఆర్థిక సహాయం చేశారని గుర్తుచేశారు. అలాంటి మనిషిని అభినందించాల్సింది పోయి విమర్శించడానికి రోజాకు సిగ్గుండాలన్నారు. రోజాకు భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కరోనా సమయంలోనూ భువనేశ్వరి బాధితులకు సహాయం అందించారని.. రోజా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కనీసం స్పందించలేదన్నారు. మహిళా అధికారులను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హెరాస్ చేస్తుంటే రోజా మాట్లాడలేదన్నారు. వనజాక్షి మాటను ఇంకా ఎన్నాళ్లు రోజా వాడుకుంటుందని అనురాధ ప్రశ్నించారు. భువనేశ్వరిని వైసీపీ నేతలు ఏం అనకపోతే స్వయంగా మీడియా సాక్షిగా ఎందుకు క్షమాపణలు చెప్పారని రోజాను అనురాధ నిలదీశారు. జగన్ను పొగడటం తప్ప ప్రజల గురించి ఏనాడైనా రోజా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.
అధికారం కోసం తల్లిని, చెల్లిని వీధి వీధినా తిప్పి.. అధికారంలోకి వచ్చాక రోడ్డున పడేసిన జగన్ రెడ్డి కంటే మహిళా ద్రోహి దేశంలో ఎవరున్నారు రోజా రెడ్డీ.? – టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @AnuradhaTdp మీడియా సమావేశం. https://t.co/NqnB8esmqL
— Telugu Desam Party (@JaiTDP) December 21, 2021
తాజావార్తలు
-
ఇక ఇంట్లోనే థియేటర్.. 120Hz డిస్ప్లే, 12 స్పీకర్లతో 115-అంగుళాల Sony BRAVIA 9 II భారీ 4K TV లాంచ్.!
-
US Iran Talks: పాకిస్థాన్కు ట్రంప్ బిగ్ షాక్.. ఇరాన్ చర్చల నుంచి పొమ్మనకుండా పొగబెట్టారా?
-
Releases Postpone : ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ పోస్ట్పోన్ కాబోతున్నాయి
-
Balochistan: ముక్కలైన పాకిస్థాన్? స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బలూచిస్థాన్.. 11 భాషల్లో లౌకిక రాజ్యాంగం!
-
PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
ట్రెండింగ్
-
iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్తో వచ్చేస్తున్న Neo 11S.!
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!