ఇదెక్కడి తలపోటు అని టీడీపీ నేతలు దిగులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఆ జిల్లా టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారట. మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో.. కొత్త తలపోట్లు మొదలైనట్టు టాక్. ఎన్నికల్లో ఇంఛార్జ్గా ఉన్నా.. ఫైనాన్స్ మేటర్స్ డీలింగ్ ఎలా అని ఒకటే మథన పడుతున్నారట.
పెనుకొండ మున్సిపాలిటీపై టీడీపీ ఫోకస్..!
Also Read
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
- YS Jagan: ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం.. మరో ఏడాదిలో పాదయాత్ర..
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు కాస్తభిన్నంగా ఉంటాయి. అధినేత వ్యూహాలను ఊహించడం తెలుగు తమ్ముళ్లకు కూడా సాధ్యం కాదు. ఒక్కోసారి చిన్న ఎన్నికలైనా రాష్ట్రస్థాయి నేతలంతా రంగంలోకి దిగుతారు. సత్తా చూపిద్దామనుకున్న సమయంలో ఎన్నికలకు దూరం అంటారు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులనే ఫేస్ చేస్తున్నారట అనంతపురం జిల్లా టీడీపీ నేతలు. వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో జిల్లాలోని కీలకమైన పెనుకొండ నగరపాలక సంస్థ ఉంది. ఈ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకుంది టీడీపీ. పార్టీకి కంచుకోటగా ఉన్న పెనుకొండను 2019లో కోల్పోవడంతో.. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచి మంత్రి అయిన శంకరనారాయణ పూర్తిస్థాయిలో పాగా వేయడానికి చూస్తున్నారు. అందుకే పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి మంత్రికి, వైసీపీ చెక్పెట్టాలనే వ్యూహంలో టీడీపీ ఉందట.
20 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు టీడీపీ ఇంఛార్జులు..!
జిల్లాలోని టీడీపీ సీనియర్లను పెనుకొండలో పాగా వేయాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు వెళ్లాయట. ఇక్కడ మొదటి నుంచి పరిటాల ఫ్యామిలీకి పట్టుంది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు ల్యాండైపోయారు. పెనుకొండ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. అధికారపార్టీని అన్నివిధాలా తట్టుకునేలా రణతంత్రం ఉండాలన్నది తమ్ముళ్ల ఆలోచన. 20 వార్డులకు 20 మంది ఇంఛార్జులను నియమించింది టీడీపీ. ఇంఛార్జులుగా ఉన్నవారంతా మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీలో కీలక నేతలు. ఏ వార్డులో ఓడినా మీదే బాధ్యత అన్నట్టు సంకేతాలు పంపుతున్నారట.
వార్డు ఇంఛార్జులే ఎన్నికల ఖర్చు భరించాలట..!
ఆదేశాలు.. దిశా నిర్దేశాలు బాగానే ఉన్నా.. అధికారపార్టీని ఢీకొట్టాలంటే మంది బలంతోపాటు ఆర్థికబలం కూడా ఎంతో ముఖ్యం. ఆ విషయంలో పార్టీ ఇచ్చిన ఆదేశాలే వార్డు ఇంఛార్జులకు మింగుడు పడటం లేదట. వార్డులకు ఇంచార్జులుగా ఉన్న నాయకులే ఖర్చులు కూడా భరించాలన్నది టీడీపీ ఆదేశం. దీంతో ఒక అడుగు ముందు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు ఉందట నాయకుల పరిస్థితి. ఒకరిద్దరు ఫైనాన్షియల్ మేటర్స్కు ఓకే చెప్పినా.. మిగతా వారు మాత్రం ఇదెక్కడి పంచాయితీ అని లోలోపల సణుక్కుంటున్నారట.
డబ్బులు తేవడం ఎలా అని టీడీపీ నేతల మథనం?
అసలే ప్రతిపక్షంలో ఉన్నాం.. సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉంది. ఈ టైమ్లో కొత్త తలనొప్పి ఏంటని అనుకుంటున్నారట టీడీపీ నేతలు. తాము ఎంత డబ్బు తీసినా.. మంత్రిగా ఉన్న శంకరనారాయణ ఊరుకుంటారా .. వారిని ఆర్థికంగా ఎదుర్కోవడం ఎలా అని ప్రశ్నించుకుంటున్నారట. దీంతో టీడీపీ నేతలకు ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైందట పరిస్థితి. అందుకే ఈ అంశం నుంచి ఎలా గట్టెక్కాలా అని ఎదురు చూస్తున్నారట.
తాజావార్తలు
-
Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
-
Babar Azam: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!