Telugu Desam Party: మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై టీడీపీ కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీలో జోష్ తేవాలని చంద్రబాబు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లాలో జరిగే మహానాడును ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మహానాడులో ముఖ్యంగా 15 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తీర్మానాలపై ఇప్పటికే టీడీపీ అగ్రనేతలు కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే రాజకీయ తీర్మానాలకు సంబంధించి ఏయే అంశాలు ప్రస్తావించనున్నారనే అంశంపై అందరి దృష్టి పడింది. ఈ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తులు, భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రంపై మహానాడులో స్పష్టమైన సంకేతాలను టీడీపీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకుండా జాగ్రత్తపడతామంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన ప్రకటనకు కొంచెం అటు ఇటుగానే టీడీపీ రాజకీయ తీర్మానం చేసే అవకాశముంది. అటు బీజేపీ విషయంలో మహానాడులో టీడీపీ ఎలాంటి ప్రస్తావన చేయబోతుందో వేచి చూడాలి. రాష్ట్రానికి ఏది మంచిదైతే అదే నిర్ణయం తీసుకుంటామని, బీసీల విషయంలో మహానాడులో ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
పొత్తులనేవి ఏదో కొత్త వ్యవహరం అన్నట్టు వైసీపీ మాట్లాడుతోందని.. ఒంటరిగా పోటీ చేయాలా లేదా పొత్తు పెట్టుకోవాలా అనేది తాము అంతర్గతంగా తీసుకునే నిర్ణయమని ఆయన తెలిపారు. మహానాడులో తీర్మానాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదు.. గాలి పార్టీ అని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తమ దగ్గర నుంచి వెళ్లిన బీసీలకే రాజ్యసభ పదవులు ఇచ్చారని.. ఏపీలో ఉన్న బీసీలు బీసీలే కాదా అని ఆయన ప్రశ్నించారు. రెండు రాజ్యసభ స్థానాలను తన పర్సనల్ వ్యవహారాలు చూసే వారికి జగన్ కేటాయించడం సిగ్గుచేటన్నారు.
Tadipatri: జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం
2014లో 103 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే.. తొమ్మిది మంది బీసీలకు మంత్రి పదవులిచ్చామని వైసీపీ నేతలు గుర్తించాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు. 151 స్థానాలు గెలిచిన వైసీపీ కేవలం 10 మంది బీసీలకే పదవులు ఇచ్చిందని ఆరోపించారు. టీడీపీ-బీసీల మధ్య ఉన్నది కాంక్రీట్ బంధం అని అభివర్ణించారు. మహానాడు వేదికకు పర్మిషన్ ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ కార్యకర్తలు బాగా ఛార్జ్ అయ్యారని.. గేర్ మార్చారని అచ్చెన్నాయుడు తెలిపారు. కార్యకర్తలకు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించే విధంగా ఒంగోలులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఒంగోలు సమీపంలోని గ్రామస్థుల సహకారంతో మహానాడు వేదికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!