ఇప్పటి అవినీతికి కోర్టులు కూడా చాలవు.. చంద్రబాబు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవు అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గుంటూరు జిల్లా చింతలపూడి వెళ్లిన ఆయన.. సంగం డెయిరీ కేసులో అరెస్టై.. జైలుకి వెళ్లొచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించారు.. పార్టీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత.. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్రది.. ఆయన తండ్రి నుండి ఇక్కడి ప్రజలకు, సంగండైరీ రైతాంగానికి అండగా ఉంటున్నారని.. వరుసగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ సేవలు అందించారని.. కానీ, ఇలాంటి పరిస్థితి నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.. విలువలు లేని, కక్షా రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు అని హెచ్చరించిన ఆయన.. రాజకీయ కక్షతో ఏ తప్పు చేయకుండా ముందస్తు నోటీసులు లేకుండా నరేంద్రాని అరెస్ట్ చేశారని ఆరోపించారు… చట్టాన్ని ఉల్లంఘించి పని చేసే వారు భౌవిష్యత్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
అందరూ వైసీపీ నేతల్లాగా తప్పుడు మనుషులు లేరు అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. ప్రభుత్వంలో 43 వేల కోట్ల రూపాయల అవినీతి చేశారన్న ఆయన.. ఇప్పుడు చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవు అన్నారు.. నరేంద్ర ఆస్తులు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గడిచిన పదేళ్లలో ఎంత పెరిగాయో ప్రజలు చూడాలన్నారు.. ధర్మం కోసం ప్రజా వ్యతిరేక విధానాలపై నరేంద్ర పోరాటం చేస్తున్నారని.. నరేంద్రను బెదిరిస్తూ వచ్చారు.. చివరికి అరెస్ట్ చేశారు అని విమర్శించారు.. ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చంద్రబాబు.. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్ట చెప్పినా వీళ్లు అరెస్ట్ చేస్తున్నారని.. ఉన్మాది పాలలో పోలీసులు కూడా అలాగే తయారయ్యారని మండిపడ్డారు.. రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి… ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారో.. అలాంటి వారిని వదిలిపెట్టబోమన్న ఆయన.. రాయలసీమలో గతంలో ఉన్నా హత్యా రాజకీయాలు, ముట్టా కక్షలకు తాము చరమగీతం పాడాం… కానీ, మళ్లీ ఈ ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. గతంలో మేం ఇదే విధంగా చేస్తే మీరు ఈ రోజు అధికారంలో ఉండేవారా…? అని ప్రశ్నించారు చంద్రబాబు.
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
తాజావార్తలు
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!