Lunar Eclipse: అన్ని ఆలయాలు మూత.. అక్కడ మాత్రం ప్రత్యేక దర్శనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lunar Eclipse: నిత్యం భక్తులకు కిటకిటలాడే ప్రముఖ ఆలయాలు సైతం.. గ్రహణం వచ్చిందంటే మూతపడతాయి… అది సూర్య గ్రహణం అయినా, చంద్రగ్రహణం అయినా.. గ్రహణ సమయానికి ముందే మూసివేసి.. ఆ తర్వాత శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే పూజలు, అభిషేకలు నిర్వహిస్తారు.. దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. అయితే, శ్రీకాళహస్తిలో మాత్రం దీనికి భిన్నంగా.. గ్రహణ సమయంలోనూ ఆలయం తెరిచే ఉంటుంది.. గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీ వాయులింగేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇతర ఆలయాలకు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి ఉన్న ప్రధాన్య వ్యత్యాసం ఇదే.. నేడు రాహు గ్రహ పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగానూ.. శ్రీకాళహస్తి దేవస్థానం తెరిచి ఉంచి భక్తులకు స్వామి అమ్మ వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు..
Read Also: Weddings: మొదలైన పెళ్లిళ్ల సీజన్.. 40 రోజుల్లో 32లక్షల వివాహాలు.. లక్షల కోట్ల వ్యాపారం
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
శ్రీకాళహస్తి దేవస్థానంలో గ్రహనకాలంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు అర్చకులు.. భక్తులకు రాహు కేతు పూజలు యథాతధంగా నిర్వహించబడతాయని అధికారులు స్పష్టం చేశారు.. గ్రహణ స్పర్శకాలం సాయంత్రం 5.41 కాగా, మధ్య కాలం 5.45, మోక్షకాలం 6.19 గంటలకు చంద్రగ్రహణం కావడంతో విడుపు సమయమైన సాయంత్రం 6 గంటలకు స్వామి వారికి శాంతి అభిషేకాలు, ధూప, దీప, నివేదనలు సమర్పించనున్నారు. అనంతరం మళ్లీ శుద్ధి అభిషేకం, నైవేధ్యం, దీపారాధనలు అయ్యాక ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, పంచ భూత లింగాలుగా మహాశివుడు భూమిపై అవతరించాడని హందూ పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అందులో భాగంగా కంచీపురం, జంబుకేశ్వరం, తిరువణ్ణామలై, చిదంబరం, శ్రీకాళహస్తీ ప్రాంతాల్లో పంచభూత లింగాలకు ఆలయాలు సైతం ఉన్నాయి. అయితే వీటిలో భూ, జల, ఆకాశ, అగ్ని ప్రతీకలు ఉన్న ఆలయాలన్నింటిని సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో మూసివేసి, పరిసమాప్తి అయిన తర్వాత శుద్ధి, ఆచమనం నిర్వహించడం అనవాయితి. అప్పటి వరకూ ఎవరూ ఆలయాల్లోకి ప్రవేశించరు. కానీ, పంచభూత లింగాల్లో ముఖ్యమైనది వాయులింగం. పంచభూతాలకు ఎలాంటి భేదాలు, మలినాలు ఉండవని పెద్దలు చెబుతుంటారు. అయితే సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో మాత్రం పంచభూత ఆలయాల్లో నాలుగింటిని మూసివేసి కేవలం వాయులింగేశ్వరుడికి మాత్రమే అభిషేకాలను నిర్వహించడం విశేషంగా చెబుతుంటారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!