తెలుగు రాష్ట్రాల్లో రాహు కేతు పూజలు, గ్రహణాల సమయంలోనూ తెరిచి వుండే శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో అవకతవకలు జరగడంతో ఈవో పెద్దిరాజు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆలయములో ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేయగా, మరో ఇద్దరికి ఛార్జి మెమోలు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలమేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ ఈఓ పెద్దిరాజు. రాహు కేతు పూజలకు సరైన సమయానికి నాగ పడగలు సప్లై చేయనందుకు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు ఈవో పెద్దిరాజు. మింట్ సూపరింటెండెంట్ రంగస్వామి, మింట్ అప్రైజర్ రవిలను సస్పెండ్ చేయగా,
ఆలయములో రాహు కేతు పూజల కౌంటర్ల వద్ధ భద్రత పర్యవేక్షణ లోపించడం వలన ఆలయ సూపరింటెండెంట్ విజయసారధి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్… ఇద్దరికీ మెమోలు జారీచేశారు. దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఈ చర్యతో ఆలయ ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది.