Ban on Diwali Celebrations: 200 ఏళ్లుగా ఏపీలోని ఆ గ్రామంలో దీపావళిపై బ్యాన్..
- శ్రీకాకుళం జిల్లాలో దీపావళికి దూరంగా ఓ గ్రామం..
- పున్నానపాలెం గ్రామ ప్రజలు పండుగకు దూరం..
- 200 ఏళ్లుగా దీపావళి వేడులకు ఆ గ్రామం దూరం..
- ఏళ్ల తరబడి కట్టుబాట్లను గౌరవిస్తున్న గ్రామస్థులు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ban on Diwali Celebrations: దీపావళి ఈ పేరు వింటేనే అంతా కోలాహలంగా ఉంటుంది. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా సందడిగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, ఓ గ్రామం మాత్రం తరతరాలుగా దీపావళి వేడుకలకు దూరంగా ఉంటోంది. అసలు… దీని వెనుక కారణం ఏంటి? పండుగకు వాళ్లు ఎందుకు దూరంగా ఉంటున్నారు? దేశవ్యాప్తంగా జరుపుకునే విధంగానే శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటారు. ఏ పండగా పేరుతో గార మండలంలో ఓ గ్రామం కూడా ఉంది. దీపావళి సమయంలో పూర్వకాలంలో అస్వస్థతకు గురైన ఓ రాజుకు సపర్యలు చేయడంతో రాజ్యంలో వెలుగులు నింపారట. ఆ గ్రామానికి దీపావళిగా పేరుపెట్టుకున్నారు. ఈ పండగను ఈ ప్రాంత వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇదే సమయంలో.. ఓ గ్రామం మాత్రం దీపావళికి దూరంగా ఉంటుంది..
Read Also: Plane Crash: హాంకాంగ్లో కూలిన విమానం.. ఇద్దరు మృతి.!
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో ఓ గ్రామం ఉంటే.. పండుగకు దూరంగా మరో ఊరు ఉంది.. అదే రణస్థలం మండలంలోని పున్నానపాలెం. దీపావళి వేడులకు ఆ గ్రామం 200 ఏళ్లుగా దూరంగా ఉంటోంది. గతంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో ఆ ఊరిలో దీపావళి రోజు చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో నాటి నుంచి నేటి వరకు అక్కడి ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకోవడం లేదు. పూర్వకాలంలో పాము ఓ ఇంట్లోకి వచ్చి ఊయలలో నిద్రిస్తున్న చిన్నారిని కాటేసిందట. ఆ చిన్నారి చనిపోయింది. అదే రోజు ఊరులో ఓ రైతుకు చెందిన రెండు ఎద్దులు కూడా మరణించాయట. ఈ విషాద ఘటనలు గ్రామస్థులను తీవ్రంగా కలిచివేశాయి. నాటి నుంచి తమ ఊరిలో దీపావళి పండుగ జరుపుకోవద్దని పెద్దలు తీర్మానించారట. పున్ననపాలెం గ్రామస్థులు ఇప్పటికీ ఆ కట్టుబాటును గౌరవిస్తూ పండుగ జరుపుకోవడం లేదు. మొత్తానికి.. దీపావళిని జరుపుకోని గ్రామాలు కూడా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. తమ పూర్వీకులు చేసిన తీర్మానాన్ని ఇప్పటికీ పాటిస్తూ.. ఆ గ్రామం దీపావళికి దూరంగా ఉంటూ వస్తుంది.. గతంలో జరిగిన ఈ విషాద ఘటనలు మళ్లీ తమ గ్రామంలో జరగకూడదు అంటే.. దీపావళికి దూరంగా ఉండడమే సరైనది అనే కట్టుబాట్లకు వచ్చారు ఆ గ్రామస్థులు.
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?