YS Jagan: లింగమయ్య కుటుంబానికి జగన్ పరామర్శ.. సర్కార్పై సంచలన ఆరోపణలు..
- రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్..
- ఇటీవల హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ..
- రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లికి వెళ్లిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు.. అసలు ఏం జరిగింది.. ఎంత మంది వచ్చారు.. ఎవరెవరిపై దాడి చేశారు.. లాంటి విషయాలపై ఆరా తీశారు.. లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చారు.. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సర్కార్పై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ జగన్.. రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆయన.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలు దిగజారాయి.. మొత్తం రెడ్బుక్ పరిపాలన నడుస్తోందని మండిపడ్డా.. చంద్రబాబు ఎంత భయపెట్టినా.. ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.. అయితే, వైసీపీ గెలిచినచోట్ల చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Karnataka: నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా.. మహిళలకు హోంమంత్రి క్షమాపణ
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అడుగడుగునా దౌర్జన్యాలకు పాల్పడ్డారు.. రాప్తాడులో జరిగిన ఘటన బాధాకరం అన్నారు జగన్.. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని సూచించారు.. అయితే, చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని తెలిపారు.. ఏపీలో ఎక్కడా శాంతి భద్రతలు లేవు.. ఎన్నికలు జరిగిన 57 స్థానాల్లో టీడీపీకి బలం లేదు.. అయితే, చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా 39 స్థానాల్లో వైసీపీ గెలుపొందిందన్నారు.. టీడీపీకి అనుకూలంగా లేదని 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేయించారని ఫైర్ అయ్యారు.. రామగిరిలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలిచింది.. అయినా.. టీడీపీ నేతలు ఎంపీపీ కోసం ప్రయత్నించి విఫలం అయ్యారన్నారు.. ఈ ఘటన తర్వాత 20 మంది దాడి చేసి లింగమయ్యను హత్య చేశారని ఆవేదన వెలిబుచ్చారు.. లింగమయ్య హత్య కేసులో కేవలం ఇద్దరిపైనే కేసులు పెట్టారు.. మరి, ఎస్ఐ సుధాకర్పై ఎందుకు చర్యలు తీసుకోరు? అని నిలదీశారు..
Read Also: Chiranjeevi: పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరంజీవి..
లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్ర తీసుకుని కేసును బిల్డప్ చేశారు.. అసలు నిందితుల్ని వదిలేసి తూతూ మంత్రంగా ఇద్దరిపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్.. పోలీసులే ఇష్టం వచ్చిన స్టేట్మొత్తం రాసుకొని.. చదువురాని లింగమయ్య భార్యతో వేలిముద్ర తీసుకున్నారని విమర్శించారు.. బేస్ బాల్ బ్యాట్తో కొట్టి చంపారు.. ఈ విషయాన్ని పోలీసులు ఎక్కడా ప్రస్తావించలేదు.. చిన్న కర్రలతో కొట్టారని.. కేసును తప్పుదారి పట్టించేలా రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సాక్షులను కూడా నిందితులకు సంబంధించినవారిని తీసుకోవడం దారుణమైన విషయం అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
-
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్స్టాపబుల్’ రైటర్తో చిరంజీవి బిగ్ ప్లాన్!
-
Allu Arjun – Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
-
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!