PM Modi : సత్యసాయి బాబా – సేవకు ప్రత్యక్ష రూపం
- పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమిగా పేర్కొన్న ప్రధాని మోడీ..
- సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉంది..
- ఎన్నో కోట్ల మందికి బాబా మార్గదర్శనం చేశారు..
- ప్రేమ, సేవకకు సత్యాసాయి బాబా ప్రతిరూపంగా నిలిచారు..
- భక్తి, జ్ఞానం, కర్మ అనేవి సేవతోనే ముడిపడి ఉంటాయి..
- బాబా జీవిత.. వసుధైక కకుటుంబం అనే భావనతో సాగింది..
PM Modi : సత్యసాయి బాబా సేవకు ప్రత్యక్ష రూపం అని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ.. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పుట్టపర్తి కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఆధ్యాత్మిక శక్తి, ప్రేమ, మానవానుకూలతలకు ప్రతీక. సత్యసాయి భౌతికంగా మనతో లేకపోయినా.. ఆయన ప్రేమ, ఆయన బోధనలు, ఆయన సేవా భావం ఇంకా కోట్లాది భక్తుల హృదయాల్లో సజీవంగా ఉన్నాయి అన్నారు.. సత్యసాయి బాబా ఎన్నో కోట్ల మందికి జీవన మార్గాన్ని చూపించారు. ప్రేమ, సేవ, నమ్మకం.. ఇవన్నీ ఆయన జీవితం మరియు సిద్ధాంతాల మూలసూత్రాలు.. భక్తి, జ్ఞానం, కర్మ.. ఇవన్నీ సేవతో ముడిపడి ఉంటాయని ఆయన తరచూ చెప్పేవారని గుర్తుచేశారు మోడీ..
Read Also: November 19: నవంబర్ 19.. భారత క్రికెట్ చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం..!
Also Read
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
- SBI Bank Robbery Case: ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.5.50 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
“మానవ సేవే మాధవ సేవ”,. ఈ ఒక్క వాక్యం ఆయన ఆధ్యాత్మికతకు ప్రతిరూపం అన్నారు నరేంద్ర మోడీ.. సత్యసాయి బాబా కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, మానవతకు సేవ చేసే యోధుడు. ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ వరకు ఉచితంగా విద్య అందించడం, అత్యాధునిక వైద్యసేవలను పేదలకు పూర్తిగా ఉచితంగా అందించడం.. ఆయన సేవా దృక్పథానికి నిలువుటద్దాలుగా నిలిచాయి. ఒకప్పుడు రాయలసీమలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండేది. అయితే సత్యసాయి ట్రస్ట్ ద్వారా వేలాది గ్రామాలకు సురక్షిత తాగునీరు చేరింది. ఇది ఆ ప్రాంత ప్రజల జీవితాలను మార్చిన చారిత్రాత్మక సేవ అన్నారు..
సత్యసాయి బాబా జీవిత తత్వం ఒకే మాటలో చెప్పాలంటే “వసుధైక కుటుంబం”. దేశం, మతం, భాష అనే గడియారాలు ఆయనకు అర్థంలేనివి.. ప్రేమ, సేవ, మానవత మాత్రమే ఆయన ధ్యేయం అన్నారు ప్రధాని మోడీ.. మరోవైపు మహిళలు, బాలికల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధాని.. బాబా బోధనలను గుర్తుచేసుకుంటూ.. మన ప్రభుత్వం 20 వేల మంది బాలికల పేర్లతో సుకన్య సమృద్ధి యోజన ద్వారా నిధులు జమ చేసింది. ఆ బాలికలు భవిష్యత్తులో విద్య, అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయడానికి ఇది ఒక దీప్తిమంతమైన మార్గం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!